ఈ ఏనుగుని కూడా అలాగే చంపేశారా?! ఇంత దారుణంగా గజరాజుల ఉసురు తీస్తున్నదెవరు?

  • Published By: nagamani ,Published On : June 4, 2020 / 09:29 AM IST
ఈ ఏనుగుని కూడా అలాగే చంపేశారా?! ఇంత దారుణంగా గజరాజుల ఉసురు తీస్తున్నదెవరు?

కేరళలో గర్భంతో ఉన్న ఏనుగును అతి కిరాతకంగా చంపిన ఘటన మర్చిపోక ముందే అటువంటి మరో ఘటన వెలుగులోకొచ్చింది. అదికూడా కేరళ రాష్ట్రంలోనే జరగటం గమనించాల్సిన విషయం. దీంతో ఆ  ఏనుగు కూడా పేలుడు పదార్థాలు తినడం వల్లే చనిపోయి ఉంటుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని మలప్పురంలో పైనాపిల్ లో బాణసంచా పదార్ధాలు పెట్టి గర్భంతో ఉన్న ఏనుగును ఘటనతో అనుమానాలు పెరుగుతున్నాయి. 

కొల్లం జిల్లా పతానపురం అటవీ ప్రాంతంలో ఏప్రిల్ నెలలో బలహీనంగా ఉన్న ఓ ఆడ ఏనుగును అటవీశాఖ అధికారులకు కనిపించింది. నడిచే ఓపిక కూడా లేకుండా ఉన్న ఆ ఏనుగుని చూసి అనారోగ్యానికి గురైందేమోనని అనుమాన పడ్డారు. దీంతో దాని పట్టుకుని చికిత్స చేసేందుకు ప్రయత్నించారు. 

కానీ అది అధికారులకు ఏమాత్రం దొరకలేదు. సహకరించకుండా వెళ్లిపోయింది. అలా వెళ్లిపోయిన ఆ ఏనుగు ఆ మరుసటి రోజే చనిపోయింది.  దానికి పోస్టుమార్టం చేయగా దాని దవడ విరిగినట్లు తేలింది.  దీంతో ఈ ఏనుగు కూడా పేలుడు పదార్థాలు తినడం వల్లే మరణించి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. 

ఇలా వరుసగా ఏనుగులను చంపడం వెనక ఏం జరుగుతోందనని అధికారులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అంతు చిక్కకుండా మారటంతో అధికారులు ఆ దిశగా దృష్టిపెట్టారు. 

కాగా ఇటీవల సైలెంట్‌వ్యాలీలో పేలుడు పదార్థాలను తిన్న గర్భంతో ఉన్న ఏనుగు నొప్పిభరించలేక నదిలో నిలబడి ఉపశమనం పొందుతూ చివరకు అంతా  చూస్తుండగానే కన్నుమూసిన ఘటనతో అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.

Read: ఆ సైకోలను వదిలేది లేదు, క్రాకర్స్ తో ఏనుగుని చంపిన ఘటనపై కేంద్రం సీరియస్