INDIA 3rd Meet: ఇండియా కూటమి 2024 ఎన్నికల వ్యూహం ఇదే.. ఈ 5 కమిటీలతో బీజేపీని కొట్టాలని ప్లాన్

దీంతో పాటు శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా డి.రాజా, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మెహబూబా ముఫ్తీలకు కూడా ఈ కమిటీలో చోటు కల్పించారు

INDIA 3rd Meet: ఇండియా కూటమి 2024 ఎన్నికల వ్యూహం ఇదే.. ఈ 5 కమిటీలతో బీజేపీని కొట్టాలని ప్లాన్

Mumbai Meet: విపక్ష కూటమి ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) శుక్రవారం (సెప్టెంబర్ 1) ముంబైలో జరిగిన సమావేశంలో భారీ ప్రకటనలు చేసింది. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలలో 2024 మహాసమర్ కోసం 5 కమిటీల కీలకమైనవి. ప్రతిపక్ష కూటమి ఇండియా వ్యూహాన్ని మార్గనిర్దేశం చేసేందుకు ఈ కమిటీలు పని చేస్తాయి.

INDIA 3rd Meet: ప్రధాని అభ్యర్థి లేరు, కన్వీనర్‭ లేరు.. అసంపూర్తిగా ముగిసిన ఇండియా కూటమి సమావేశాలు

ఇండియా అలయన్స్ సమావేశంలో కోఆర్డినేషన్ కమిటీతో సహా ఐదు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ ఐదు కమిటీలలో అతి ముఖ్యమైనది సమన్వయ కమిటీ, ఇది కూటమి యొక్క ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడానికి పని చేస్తుంది. దీంతో పాటు పబ్లిసిటీ, మీడియా, సోషల్ మీడియా, రీసెర్చ్‌ల కోసం ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అన్ని కమిటీల్లో ప్రధాన పార్టీల నేతలను చేర్చారు.

సమన్వయ కమిటీ
14 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీలో పలు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు చోటు దక్కించుకున్నారు. ఈ సమన్వయ కమిటీ కూటమికి అత్యున్నత విభాగంగా వ్యవహరిస్తుందని పీటీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కమిటీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు మరియు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.

INDIA 3rd Meet: ముంబై సమావేశంలో పెద్ద డ్రామా.. ఒక్కసారిగా ప్రత్యక్షమైన కపిల్ సిబాల్, కస్సుబుస్సన్న కాంగ్రెస్ నేతలు

దీంతో పాటు శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా డి.రాజా, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మెహబూబా ముఫ్తీలకు కూడా ఈ కమిటీలో చోటు కల్పించారు. ఈ కమిటీలో జనతాదళ్ యునైటెడ్ ప్రెసిడెంట్ లాలన్ సింగ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జావేద్ అలీ ఖాన్ కూడా ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు పనులు సెప్టెంబర్ 30 నాటికి పూర్తవుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.