Bank Jobs : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41వేలకు పైగా ఉద్యోగాలు.. కేంద్రం కీలక ప్రకటన

దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రస్తుతం ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి?

Bank Jobs : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41వేలకు పైగా ఉద్యోగాలు.. కేంద్రం కీలక ప్రకటన

Bank Jobs

Bank Jobs : దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రస్తుతం ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? అనే వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 41వేల 177 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. బ్యాంకులకు మంజూరు చేసిన మొత్తం పోస్టుల్లో ఇది 5శాతానికి సమానం అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 8,05,986 ఉద్యోగాలు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం ఎస్బీఐలో అత్యధికంగా 8,544 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.

Twitter New Feature : ట్విట్టర్‌లో టిక్‌టాక్‌ లాంటి కొత్త ఫీచర్.. వర్టికల్ వీడియో ఫీడ్..!

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిపోయిన విషయం ప్రభుత్వానికి తెలుసా..? అని లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. డిసెంబర్‌ 1వ తేదీ నాటికి బ్యాంకులకు కేటాయించిన పోస్టుల్లో 95శాతం భర్తీ అయ్యాయని ఆమె వెల్లడించారు. పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులకు కేటాయించిన 8,05,986 ఉద్యోగాల్లో కేవలం 41,177 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని వివరించారు. మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్‌, క్లర్క్‌, సబ్‌స్టాఫ్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయని తెలిపారు.

ఏ బ్యాంకులో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే..
* ఎస్బీఐలో 8వేల 544
* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 6వేల 743
* సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో 6వేల 295
* ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో 5వేల 112
* బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 4వేల 848 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

WhatsApp Privacy Update : వాట్సాప్‌లో న్యూ అప్‌డేట్.. ఈ కొత్త ప్రైవసీతో వారికి చెక్ పెట్టొచ్చు..!

కాగా, గత ఆరేళ్లలో పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌లో మాత్రమే ఒక్క పోస్టు తగ్గించామని, మిగిలిన బ్యాంకుల పోస్టుల్లో ఎటువంటి కోత విధించలేదని కేంద్రమంత్రి వివరించారు. బ్యాంకులు వాటి అవసరాలకు తగినట్లు నియామకాలు చేపడుతున్నాయని కేంద్రమంత్రి క్లారిటీ ఇచ్చారు.