Supreme Court: సాక్ష్యం లేకుండా డాక్టర్ నిర్లక్ష్యం వల్లే పేషెంట్ చనిపోయాడని ఎలా అంటాం?

ఆపరేషన్ చేసే సమయంలో పేషెంట్ చనిపోతే అది డాక్టర్ల నిర్లక్ష్యం అని అనలేం అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయినట్లుగా మెడికల్ ఎవిడెన్స్ ఉండాలని..

Supreme Court: సాక్ష్యం లేకుండా డాక్టర్ నిర్లక్ష్యం వల్లే పేషెంట్ చనిపోయాడని ఎలా అంటాం?

Patient Dies During Surgery It Cannot Be Automatically Assumed

Supreme Court : ఆపరేషన్ చేసే సమయంలో పేషెంట్ చనిపోతే అది డాక్టర్ల నిర్లక్ష్యం అని అనలేం అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే రోగి చనిపోయినట్లుగా సాక్ష్యం ఉండాలని..ఎటువంటి మెడికల్ ఎవిడెన్స్ లేకుండా డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే రోగి చనిపోయాడని అనలేం అని స్పష్టచేసింది. ఎన్‌సీడీఆర్‌సీ ఓ డాక్టర్ విషయంలో ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చుతూ జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఏఎస్ బొప్పన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.ఆపరేషన్ విజయవంతం కాకుండా పేషంట్ చనిపోతే అటువంటి సందర్భాల్లో దాదాపు ప్రతీ సందర్భంలోను డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనే అభిప్రాయానికి రావడం సమంజసం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఆపరేషన్ చేసే సమయంలో పేషెంట్ చనిపోతే..సదరు పేషంట్ తరపు కుటుంబ సభ్యులు డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడని..దాడులు చేయటం..నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఓ పేషెంట్ విషయంలో ఎన్‌సీడీఆర్‌సీలో ఫిర్యాదు చేయగా..సదరు డాక్టర్ ఆ ఆపరేషన్ కు అయిన ఖర్చు తదితర ఖర్చులకు సంబంధించి అయిన రూ.17 లక్షల్ని వడ్డీతో సహా చెల్లించాలని ఎన్‌సీడీఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాలపై సదరు బాధిత డాక్టర్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. పేషెంట్ ప్రాణాలు కాపాడటానికే డాక్టర్లు ఎన్నో విధాలుగా యత్నిస్తాం. కానీ ప్రాణాలు తీయాలని ఏ డాక్టరు అనుకోరని దయచేసి నాకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టును కోరాడు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు బెంచ్ ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయినట్లు ఫిర్యాదుదారుడు ఎన్‌సీడీఆర్‌కి ఎటువంటి ఆధారాలు సమర్పించలేదని..కేవలం ఆరోపణలతో డాక్టర్ నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయాడని భావించలేమని దాదాపు 25 ఏళ్ల క్రిందటి కేసులో విషయంలో ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.

ఈ కేసు వివరాల్లోకి వెళితే..1991,అక్టోబర్ 8న ఒక పేషంట్ హాస్పిటల్‌కు వెళ్లింది. ఆమె కుడి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని..ఎడమ కిడ్నీ కూడా హైడ్రోనెప్రోసిస్ బారిన పడటంతో పాడైపోయి గ్రేడ్ II దశలో ఉందని పరీక్షల్లో బయటపడింది. శస్త్ర చికిత్స చేయాలని డాక్టర్లు తెలిపారు. డిసెంబర్ 6, 1996న ఆ పేషంట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. కిడ్నీలు పాడైన కారణంగా రెండు కిడ్నీలకు ఒకేసారి ఆపరేషన్ చేయలేమని ఆ పేషంట్‌కు, ఆమె భర్తకు డాక్టర్లు స్పష్టంచేశారు. రెండు విడతలుగా ఈ ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని వివరించారు. ముందు తక్కువ పాడైన ఎడమ కిడ్నీకి ఆపరేషన్ చేస్తామని..కుడి కిడ్నీ పూర్తిగా పాడవడంతో తొలగించే పరిస్థితి కూడా ఉందని వివరించారు.

సర్జన్ చెప్పినట్టుగానే ఎడమ కిడ్నీకి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. అలా డిసెంబర్ 12, 1996 నాటికి ఆ పేషంట్ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఆ తరువాత అదే సంవత్సరం డిసెంబర్ 16 కుడి కిడ్నీకి ఆపరేషన్ చేశారు. కుడి కిడ్నీకి ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఆ పేషంట్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. బీపీ లెవల్స్ భారీగా పడిపోయాయి. పల్స్ రేటు కూడా తగ్గిపోయింది. కానీ ఆపరేషన్ విజయవంతంగానే పూర్తి చేశారు.

ఆ తరువాత ఆ పేషెంట్ అదే సంవత్సరం డిసెంబర్ 23న హార్ట్ ఎటాక్ వచ్చి ఆ పేషంట్ చనిపోయింది.దీంతో పేషెంట్ తాలుకు ఆపరేషన్ డబ్బులతో పాటు మిగిలిన బ్యాలెన్స్ పేపెంట్ మొత్తం కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని తెలిపారు. దానికి పేషంట్ భర్తకు ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో గొడవకు దిగాడు. ‘మీరు ఆపరేషన్ సరిగా చేయలేదు. మీ నిర్లక్ష్యం వల్లనే నా భార్య చనిపోయింది..కాబట్టి మీరే నాకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అలా ఆ డాక్టర్ పైనా..ఆసుపత్రిపై కూడా పేషంట్ భర్త కేసు పెట్టాడు. ఈ కేసులో సుప్రీంకోర్టు తాజాగా డాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఆ పేషంట్ చనిపోయినట్లు ఆధారాలు లేవని తేల్చి చెప్పింది.