Petrol, Diesel Prices : దేశంలో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..అక్టోబర్ లో 24 సార్లు పెంపు

దేశంలో గతకొద్ది రోజులుగా చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి.

Petrol, Diesel Prices : దేశంలో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..అక్టోబర్ లో 24 సార్లు పెంపు

Petrol (3)

petrol and diesel prices hike : దేశంలో గతకొద్ది రోజులుగా చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా ఐదో రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 39 పైసల చొప్పున పెరిగాయి.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.72కు చేరగా, డీజిల్‌ ధర రూ.106.99కు పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.109.34, డీజిల్‌ రూ.98.07కు చేరాయి. ముంబైలో పెట్రోల్‌ రూ.115.15, డీజిల్‌ రూ.106.23కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.109.79, డీజిల్‌ రూ.101.19కు పెంచారు. చెన్నైలో పెట్రోల్‌ రూ.106.04, డీజిల్‌ రూ.102.25కు చేరింది.

MLC Elections : తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

అక్టోబర్ నెలలో 24 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు అక్టోబర్ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు 7 రూపాయలు పెరిగాయి. దేశంలో 14 రాష్ట్రాల్లో లీటర్ డీజిల్ ధర 100 దాటింది. కేరళ, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు,

గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, బెంగాల్, జమ్మూకాశ్మీర్ లేహ్‌లో డీజిల్ ధర 100 దాటింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ నెల నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 9-10 డాలర్లు పెరిగింది.