Vande Bharat Express: ఉత్తరాఖండ్ లో తొలి వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

ఈ వందే భారత్ రైలు డెహ్రాడూన్, ఢిల్లీ మధ్య నడవనుంది. కవాచ్ టెక్నాలజీతో సహా అధునాతన భద్రతా ఫీచర్లతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడవనుంది.

Vande Bharat Express: ఉత్తరాఖండ్ లో తొలి వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi

Vande Bharat Express Train – PM Modi : ఉత్తరాఖండ్ లో తొలి వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. స్వదేశీయంగా నిర్మించిన డెహ్రాడూన్ – ఢిల్లీ వందే భారత్ రైలును గురువారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. డెహ్రాడూన్ రైల్వే స్టేషన్‌లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు.

ఈ వందే భారత్ రైలు డెహ్రాడూన్, ఢిల్లీ మధ్య నడవనుంది. కవాచ్ టెక్నాలజీతో సహా అధునాతన భద్రతా ఫీచర్లతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడవనుంది. ఈ వందే భారత్ రైలు ఉత్తరాఖండ్ కనెక్టివిటీని వేగవంతం చేయనుంది.

Vande Bharat Express : సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభం..

ఉత్తరాఖండ్ రైలు ట్రాక్స్ 100 శాతం విద్యుద్దీకరణ పూర్తి అయింది. ఉత్తరాఖండ్‌లో కొత్తగా విద్యుద్దీకరించిన రైలు మార్గాలను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు.