Cabinet Committees : కేంద్ర కేబినెట్ కమిటీల్లో మార్పులు..స్మృతి ఇరానీ,సర్బానంద్‌ సోనోవాల్‌ కు చోటు

ఇటీవల కేంద్ర క్యాబినెట్ విస్తరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్ కమిటీల్లోనూ మార్పులు చేశారు. పాత,కొత్త మంత్రులతో మార్పులు చేశారు.

Cabinet Committees : కేంద్ర కేబినెట్ కమిటీల్లో మార్పులు..స్మృతి ఇరానీ,సర్బానంద్‌ సోనోవాల్‌ కు చోటు

Cabinet

Cabinet Committees : ఇటీవల కేంద్ర క్యాబినెట్ విస్తరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్ కమిటీల్లోనూ మార్పులు చేశారు. పాత,కొత్త మంత్రులతో మార్పులు చేశారు. ఈ కమిటీల్లో యువ మంత్రులకు మోడీ అవకాశం కల్పించారు. ప్రధానమంత్రి మోడీ నేతృత్వం వహిస్తున్న అత్యంత ప్రాధాన్యం ఉండే రాజకీయ వ్యవహారాల కేబినెట్ ఉపసంఘంలో స్మృతీ ఇరానీ, భూపేంద్రయాదవ్, వీరేంద్రకుమార్, గిరిరాజ్ సింగ్, అర్జున్ ముండా, సర్బానంద్‌ సోనోవాల్‌, మన్‌సుఖ్ మాండవీయ కు చోటు కల్పించారు.

ఉద్యోగాల కల్పన, స్కిల్ డెవలప్‌‌మెంట్ కేబినెట్ కమిటీలో అశ్విన్ వైష్ణవ్, భూపేందర్ యాదవ్, రామచంద్ర ప్రసాద్ సింగ్, కిషన్ రెడ్డిలకు అవకాశం కల్పించారు. పెట్టుబడులు, అభివృద్ధి కేబినెట్ కమిటీలో మోడీ, అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు నారాయణ్ రాణే, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్‌‌లకు స్థానం దక్కింది.

ఇక రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీలో కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్, కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్‌‌కు స్థానం కల్పించారు. ఇక దేశభద్రతకు సంబంధించి అత్యున్నత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో ఎలాంటి మార్పులు చేయలేదు.