నాగ్ పూర్ లో ఓటు వేసిన RSS చీఫ్ మోహన్ భగత్

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 03:23 AM IST
నాగ్ పూర్ లో ఓటు వేసిన RSS చీఫ్ మోహన్ భగత్

నాగ్ పూర్ : ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ్ భగత్ నాగ్ పూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ఓటు వేయడం ప్రతీ ఓటరు బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఇవాళ 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలల్లోని 91 లోక్‌సభ నియోజవక వర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

కేంద్ర మంత్రి వీకే సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండోసారి ఇక్కడి నుంచి గెలుపొందాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. బీజేపీ గెలుస్తుందని, ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వీకే సింగ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, మరో కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ యూపీలోని బాగ్‌పట్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

అలాగే ఉత్తరాఖండ్ దేవల్చర్ హల్ద్వానీలో మాజీ సీఎం హరీశ్ రావ్  కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
దేశ వ్యాప్తంలో సార్వత్రిక ఎన్నికలు తొలి దశ పోలింగ్ జరుగుతున్న క్రమంలో ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. తొలి విడతలో 20 రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి.