అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్ఎస్ఎస్ డెడ్లైన్
ఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్ఎస్ఎస్ డెడ్లైన్ విధించింది. 2025 నాటికి రామ మందిర నిర్మాణం పూర్తి చేయాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆర్ఎస్ఎస్ నేత భయ్యాజీ జోషి తెలిపారు. రామ మందిర నిర్మాణాన్ని ఇప్పుడు ప్రారంభిస్తేనే ఐదేళ్ల వరకు పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆలయ నిర్మాణాన్ని ఈ నెల 25న ప్రారంభించాలని చెప్పారు.