కాళ్లకు నమస్కరించి : మాయా బ్లెస్సింగ్స్ తీసుకున్న అఖిలేష్ భార్య
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో ఎలాగైనా బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో బద్దశత్రువులుగా ఉన్న ఎస్పీ,బీఎస్పీలు చేతులు కలిపాయి. ఏళ్లుగా కొనసాగుతున్న విభేధాలను పక్కనబెట్టి మాయా,అఖిలేష్ లు చేతులు కలపడం మాత్రమే కాకుండా వారి మధ్య వ్యక్తిగతంగా ఆత్మీయ బంధాలు కూడా పెరిగాయి. గురువారం (ఏప్రిల్-25, 2019) కన్నౌజ్ లో తన తరపున ప్రచారం చేస్తున్న మాయావతి కాళ్లకు అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ నమస్కారం చేయడమే దీనికి సాక్ష్యం.
Also Read : ట్వింకిల్ చేరబోయే పార్టీ ఇదే
కన్నౌజ్ లోక్ సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా మరోసారి డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కన్నౌజ్ లో డింపుల్ కి మద్దతుగా మాయా ప్రచారం నిర్వహించారు. ప్రచార సమయంలో డింపుల్ యాదవ్ మాయా కాళ్లకు నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.డింపుల్ మాయా కాళ్లకు నమస్కరించడంపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఎస్పీ-బీఎస్పీ కూటమి ఏర్పాటు అయిన తర్వాత అఖిలేష్ తనను వాళ్ల కుటుంబ పెద్దగా గౌరవిస్తున్నాడని,డింపుల్ ని తన కుటుంబ సభ్యురాలిగా అంగీకరించానని మాయావతి తెలిపారు.
Also Read : బొమ్మ పడదు : పీఎం నరేంద్ర మోడీ బయోపిక్ మే 19 తర్వాతే
కుటంబ పెద్దకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నట్లుగానే డింపుల్ తన ఆశీర్వాదం తీసుకున్నట్లు మాయా తెలిపారు. నాలుగో విడతలో భాగంగా ఏప్రిల్-29,2019న కన్నౌజ్ స్థానానికి పోలింగ్ జరుగనుంది. యూపీలో బీఎస్పీ-ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.బీఎస్పీ 38 లోక్ సభ స్థానాల్లో,37 స్థానాల్లో ఎస్పీ,మూడు స్థానాల్లో ఆర్ఎల్డీ పొటీ చేస్తుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ,సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయబరేలీలో కూటమి అభ్యర్థులను పోటీకి దించలేదు.
#WATCH Samajwadi Party leader Dimple Yadav takes blessings of BSP chief Mayawati at a ‘mahagathbandhan’ rally in Kannauj, earlier today pic.twitter.com/ZGUny3aPET
— ANI UP (@ANINewsUP) April 25, 2019