SBI Alert: ఎస్బీఐ కస్టమర్లకు ముఖ్య గమనిక

SBI Alert: ఎస్బీఐ కస్టమర్లకు ముఖ్య గమనిక

Sbi Alert

SBI Alert : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ, యోనో, యోనో లైట్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై ఖాతాదారులు తమకు సహకరించాలని కోరింది.

”జూలై 16 శుక్రవారం రాత్రి 10.45 గంటల నుంచి జూలై 17 అర్ధరాత్రి 1.15 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో, యోనో లైట్ సర్వీసులు నిలిచిపోతాయి. ఈ సమయంలో కస్టమర్లు ఎలాంటి లావాదేవీలు చేయొద్దు” అని ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించాలని ఎస్బీఐ కోరింది. మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడం కోసం అప్ డేషన్ జరుగుతోందని, కస్టమర్లు తమకు సహకరించాలని ఎస్బీఐ అభ్యర్ధించింది.