SBI Alert: ఎస్బీఐ కస్టమర్లకు ముఖ్య గమనిక
SBI Alert : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ, యోనో, యోనో లైట్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై ఖాతాదారులు తమకు సహకరించాలని కోరింది.
”జూలై 16 శుక్రవారం రాత్రి 10.45 గంటల నుంచి జూలై 17 అర్ధరాత్రి 1.15 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో, యోనో లైట్ సర్వీసులు నిలిచిపోతాయి. ఈ సమయంలో కస్టమర్లు ఎలాంటి లావాదేవీలు చేయొద్దు” అని ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించాలని ఎస్బీఐ కోరింది. మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడం కోసం అప్ డేషన్ జరుగుతోందని, కస్టమర్లు తమకు సహకరించాలని ఎస్బీఐ అభ్యర్ధించింది.
We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/HwIug1nEFB
— State Bank of India (@TheOfficialSBI) July 15, 2021