సింహానికి కోడిని ఎరవేసి వేధించి..హింసించిన ఏడుగురికి జైలుశిక్ష..జరిమానా

సింహానికి కోడిని ఎరవేసి వేధించి..హింసించిన ఏడుగురికి జైలుశిక్ష..జరిమానా

seven jailed for harassing liones : వన్యప్రాణుల ఆవాసంలోకి వెళ్లడమే కాకుండా.. వాటిని వేధించటం, హింసించటం చట్టరీత్యా నేరం.అలా ఓ హింహాన్ని వేధించిన ఏడుగురికి గుజరాత్ కోర్టు జైలు శిక్ష విధించింది. గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అడవిలో ఓ సింహాన్ని ఏడుగురు వేధించారు. కోడిని ఎరవేసి సింహాంతో పరచకాలాడారు. గుజరాత్‌లోని గిర్ అడవిలో ఓ సింహాన్ని ఏడుగురు వ్యక్తులు వేధించారు. వీరిలో ముగ్గురు టూరిస్టులు కూడా ఉన్నారు. 2018లో ఈ ఘటన జరుగగా వారిపై పోలీసులు కేసు నమోదుచేశారు. అహ్మదాబాద్‌కు చెందిన ముగ్గురు పర్యాటకులతో సహా ఏడుగురిని దోషులుగా గిర్ గధాడ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ సునీల్ కుమార్ దేవ్ ప్రకటించారు.

వీరిలో ఆరుగురు నిందితులకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, మరొకరికి ఏడాది జైలు శిక్ష ఖరారు చేశారు. గిర్ అడవుల్లో బాబారియా పరిధిలోని ధూంబకారియాలో కొందరు వ్యక్తులు ఓ కోడిని సింహానికి ఎరగా వేసి దాన్ని ఇబ్బంది పెట్టారు. హింసించి పైశాచికానందం పొందారు. వాళ్లు చేసిన ఈ ఘనకార్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీళ్లు చేసింది వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు 2018 మే నెలలో నిందితులను ఎనిమది మంది నిందితులను అరెస్టు చేశారు.

సింహానికి కోడిని ఎరగా వేస్తూ దాన్ని ఆటపట్టించారు. కోడిని తినటానికి సింహం ఆశపడగా..ఆ కోడిని దూరంగా తీసివేసి..మరోసారి సింహం దగ్గర పెట్టి మళ్లీ తీసి వేసి ఇలా సింహం ఆశతోను..ఆకలితోను పరాచికాలాడారు. దీనికి పాల్పడిన గిర్ గధాడ తాలూకాకు చెందిన ఇలియాస్ హోత్, అబ్బాస్ బలూచ్, అల్తాఫ్ బలూచ్‌, అహ్మదాబాద్‌కు చెందిన పర్యాటకులు రవి పటాడియా, దివ్యంగ్ గజ్జర్, రతిన్ భాయ్ పటేల్‌లను కోర్టు దోషులుగా నిర్ధారించింది.

వన్యప్రాణి రక్షణ చట్టం సెక్షన్ 2 (16) (బి) ఏదైనా జంతువులను పట్టుకోవడం, ఉచ్చువేయడం, ఎర వేయడం, హింసించటం, అభయారణ్యంలో అక్రమంగా ప్రవేశించడం నేరం. ఈ చట్టం కింద ఆరుగురికి మూడేళ్ల శిక్ష, మరో దోషి మీనాకు సెక్షన్ 27 ప్రకారం ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. దోషులకు రూ.10వేల చొప్పున జరిమాని విధించింది గుజరాత్ కోర్టు. అనంతరం సింహాల సంక్షేమ నిధికి మరో రూ.35,000 జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.