13ఏళ్ల బాలికపై Siతో సహా 8 మంది అత్యాచారం..వ్యభిచార ముఠాకు అమ్మేసిన బంధువులు

  • Published By: nagamani ,Published On : November 24, 2020 / 03:10 PM IST
13ఏళ్ల బాలికపై Siతో సహా 8 మంది అత్యాచారం..వ్యభిచార ముఠాకు అమ్మేసిన బంధువులు

Tamil nadu 13 year old girl raped by police officer : 13ఏళ్ల బాలిక. ఆడుకోవాల్సిన వయస్సులో జీవితంలో ఎన్నడూ ఊహించని దారుణ హింసలకు గురైంది. పట్టుమని 15 ఏళ్లుకూడా నిండని పసి వయస్సులో వెయ్యేళ్ల జీవితపు దారుణ హింసలను భరించింది. కన్నవాల్లే ఆమె లేత శరీరంపై వ్యాపారం చేశారు. పండంటి జీవితాన్ని చిదిమేసి చిందరవందచేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులు ఆ బాలికపై అత్యాచారం చేశారు.



ఇన్ని దారుణాలకు బలైన చిన్నారి అనుభవించిన హింసలను ఊహిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. దానికి కారణమైనవారిని నడిరోడ్డుపై ఉరితీయాలనిపిస్తుంది. ఆలస్యంగా వెలుగుకి వచ్చిన ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో సంచలనంగా మారింది.



కంటికి రెప్పలా కాపాడాల్సిన కుటుంబ సభ్యులు.. న్యాయం చేయాల్సిన పోలీసులే ఆ చిన్నారిని చిదిమేశారు. అభం శుభం తెలియని చిన్నారిని లైంగికంగా దోచుకున్నారు. బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించి నరకం చూపించారు. కంచే చేను మేసిందన్న చందంగా ఓ సీనియర్ ఇన్‌స్పెక్టర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ అత్యంత అమానుష ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది.



వివరాల్లోకి వెళితే..వాషర్‌మెన్‌పేటకి చెందిన 13ఏళ్ల బాలిక వారి బంధువల ఇంటిలో ఉంటోంది. ఆ బాలికపై ఓ పోలీసు అధికారితో పాటు ఓ రాజకీయ నేత కామపు కళ్లు పడ్డాయి. వారి కళ్లనుంచి లేడిపిల్లలాంటి ఆ చిన్నారి తప్పించుకోలేకపోయింది. వారి కామపు కాటుకు బలైపోయింది. పదమూడేళ్ల చిన్నారిపై కన్నేసిన పోలీసు అ అత్యాచారం చేశాడు. అతనితో పాటు ఓ రాజకీయ నేత మరికొంతమంది పోలీసులు కూడా ఆమెను లైంగికంగా దోచుకున్నారు.అలా ఆ చిన్నారిపై రోజుకు ఎనిమిదిసార్లు ఆ ఘోరకృత్యం జరిగింది.



ఆ బాలిక ఎంతటి అభాగ్యురాలో తెలుసుకుంటే ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా అనిపిస్తుంది. అత్యాచారానికి గురైన ఆ బాలికను కాసుల కోసం కక్కుర్తి పడి బంధువులే కామాంధుల చేతికి అప్పగించారు. బాలిక బంధువైన ఓ యువతి బాలికను తీసుకెళ్లి ఆమె భర్త మధన్ కు అప్పగించింది.మొదటి మాధన్ అత్యాచారం చేసి తరువాత అతని తల్లి మరో యువతి కలిసి బ్రోకర్ల చేతికి అప్పగించారు. అలా పోలీసు ఇన్పెక్టర్ పుగజ్జెంతిని చేతికి అప్పగించారు. అలా ఇన్పెక్టర్ పుగజ్జెంతి అనంతరం ఓ రాజకీయ నేత ఆ తరువాత మరో ఐదుగురు ఆమెపై అత్యాచారాలకు తెగబడ్డారు.



ఆ పోలీసు అధికారికి అప్పగించారు. సంతలో పశువుని అమ్మినట్లుగా బేరం ఆడుకుని మరీ అమ్మేశారు. ఆమె లేత శరీరంతో వ్యాపారం చేశారు. కాసుల కోసం పసిబిడ్డ జీవితాన్నే చిదిమేసారు. ఆ బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దించి నరకం చూపించారు. ఆటలాడుకోవాల్సి వయస్సులో వరుస అత్యాచారాలకు గురైంది ఆ చిన్నారి. ఖాకీలు,రాజకీయ నేత కామానికి..కన్నవారి దగాకోరుతనానికి చిత్రహింసలకు గురైంది.

అలా ఆ చిన్నారి జీవితంలో రెండు నెలలపాటు వరుస అత్యాచారాలు జరిగాయి.అలా బలవంతపు వ్యభిచారాలకు గురైంది. ఈ క్రమంలో బాలిక తల్లి కూతుర్ని చూడాలని ఉందని చెప్పటంతో బాలికను తీసుకొచ్చారు. కూతుర్ని అలా చూసిన తల్లికి అనుమానం వచ్చి అడిగేసరికి జరిగిందంతా చెప్పటంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం బైటపడింది.



ఈ దారుణ ఘటనపై చెన్నై పోలీస్ కమిషనర్‌ సీరియస్‌గా స్పందించారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌స్పెక్టర్ పుగజ్జెంతిని సస్పెండ్ చేశారు. ఆ ఇన్‌స్పెక్టర్ తో పాటు బాలికపై అత్యాచారాలు చేసిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.



ఆమె పేరెంట్స్.. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన మరో ఐదుగురిని కూడా అరెస్టు చేసి కటకటాలవెనక్కి నెట్టారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై ప్రత్యేక బృందాన్ని నియమించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.