Minor Gang Rape : బాలికపై ఏడాదిగా 30మందికిపైగా అత్యాచారం కేసులో షాకింగ్ ట్విస్ట్, డబ్బు కోసం దిగజారిపోయింది

కర్నాటక రాష్ట్రంలో సంచలనం రేపిన బాలికపై ఏడాదిగా 30మందికిపైగా అత్యాచారం కేసు విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూస్తున్నాయి. అసలు విషయం తెలిసి పోలీసులే నిర్ఘాంతపోయారు. సభ్య సమాజం తలదించుకుంది.

Minor Gang Rape : బాలికపై ఏడాదిగా 30మందికిపైగా అత్యాచారం కేసులో షాకింగ్ ట్విస్ట్, డబ్బు కోసం దిగజారిపోయింది

Minor Gang Rape

Minor Rape By 30 Persons : కర్నాటక రాష్ట్రంలో సంచలనం రేపిన బాలికపై ఏడాదిగా 30మందికిపైగా అత్యాచారం కేసు విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూస్తున్నాయి. అసలు విషయం తెలిసి పోలీసులే నిర్ఘాంతపోయారు. సభ్య సమాజం తలదించుకుంది. ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఇందులో కన్నతల్లే ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

చిక్కమగళూరు జిల్లాలోని శృంగేరిలో 15ఏళ్ల బాలికపై ఏడాదిగా 30సార్లకు పైగా అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి బాలిక ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే 32మంది కామాంధుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తును కొనసాగించే కొద్దీ అనూహ్య సంఘటనలు వెలుగులోకి వస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఉత్తర కర్ణాటక నుంచి కూతురితో వచ్చిన ఓ మహిళ తనను భర్త వదిలేశాడని అందుకే తన సోదరి కుమార్తెతో శృంగేరికి వచ్చానంది. ఆ సమయంలోనే ఓ వ్యక్తితో వివాహమైనా.. కొంతకాలానికే అతడితో తెగతెంపులు చేసుకుంది. తన సోదరి కుమార్తె అని కొందరికి, తన భర్తకు అతని మొదటి భార్యకు పుట్టిన సంతానమని మరికొందరికి ఆ బాలిక గురించి చెబుతూ వచ్చింది.

ఏడాదిగా తనపై 30 మంది అత్యాచారం చేస్తున్నారంటూ బాలిక ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా అన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. పినతల్లిగా చెప్పుకొనే ఆ మహిళ కన్నతల్లేనని.. డబ్బు కోసం కూతురితో వ్యభిచారం చేయిస్తోందని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే డబ్బు కోసం ఇంత నీచానికి ఒడిగట్టిందని తెలిసి అంతా విస్తుపోతున్నారు. కూతురిని వ్యాపార వస్తువుగా మార్చిందని తెలిసి ఆవేదన చెందుతున్నారు. పిల్లలకు చిన్న కష్టం వచ్చిన తల్లి మనసు విలవిలలాడిపోతుంది. అలాంటిది, ఆమె మాత్రం దారుణానికి ఒడిగట్టింది. ఏ తల్లి తన కూతురితో ప్రవర్తించని విధంగా చేసింది. ఆ కసాయి తల్లిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

2020 సెప్టెంబర్ 1 నుంచి 2021 జనవరి 27 వరకు.. 30సార్లకు పైగా బాలికపై అత్యాచారం జరిగింది. కొన్ని సార్లు ఒక్కో రాత్రి ఏకంగా ముగ్గురు వ్యక్తులు బాలికపై అత్యాచారం చేశారు. నిందితులను పోలీసులు హాజరుపరచగా బాలిక వారిని గుర్తు పట్టింది. బాలిక చాలా బలహీనంగా ఉంది. అయినా, ఈ దురాఘతాలను, నొప్పిని ఎలా భరించిందో అని అంతా జాలి చూపించారు. ఈ కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు శృంగేరి సీఐని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎస్ఐపై బదిలీ వేటు పడింది. ఎస్పీ ఎన్ఎస్ శృతి ఆధ్వర్యంలో కొత్త టీమ్ ని ఏర్పాటు చేసి ఈ కేసుని విచారిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన టీమ్ ఈ కేసుని చేధించింది. నిందితులందరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.