UP Lovers: సూసైడ్‌కు యత్నించిన లవర్స్, చివర్లో ట్విస్ట్

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ లో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు యత్నించారు. కాకపోతే అనుకున్నట్లుగా జరగలేదు. పెళ్లి అయిన ఇన్నేళ్ల తర్వాత ఆరేళ్ల కూతురికి తల్లి అయిన 32ఏళ్ల మహిళ 30ఏళ్ల వయస్సున్న చందుతో ప్రేమలో పడింది.

UP Lovers: సూసైడ్‌కు యత్నించిన లవర్స్, చివర్లో ట్విస్ట్

Uttar Pradesh

 

 

UP Lovers: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ లో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు యత్నించారు. కాకపోతే అనుకున్నట్లుగా జరగలేదు. పెళ్లి అయిన ఇన్నేళ్ల తర్వాత ఆరేళ్ల కూతురికి తల్లి అయిన 32ఏళ్ల మహిళ 30ఏళ్ల వయస్సున్న చందుతో ప్రేమలో పడింది.

ఇద్దరు తమ పార్టనర్లను వదిలి బతకాలనుకున్నారు. సమాజ కట్టుబాట్ల కారణంగా అది సాధ్యపడలేదు. ఫ్రస్ట్రేషన్ కు గురైన ఆ జంట.. కలిసి బతకలేకపోయామని కలిసి చావాలని ఫిక్స్ అయ్యారు. యమునా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు.

అక్కడే చందుకు తన లవర్ ట్విస్ట్ ఇచ్చింది. యమునా నదినీళ్లలో ప్రాణాలు వదిలేయాలనుకున్న వాళ్ల ప్లానింగ్ మారిపోయింది.

Read Also : మద్యం మత్తులో మేనల్లుడిపై కాల్పులు

32ఏళ్ల మహిళ.. చందుపై కంప్లైంట్ ఇచ్చింది. ఎలా అంటే నదిలోకి దూకిన వెంటనే ఈత వచ్చిన మహిళ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. ఆ తర్వాత చందు తనను హత్య చేసేందుకు ప్రయత్నించాడని, మొబైల్ ఫోన్ కూడా పగులగొట్టేశాడని చెప్పింది.

కొన్నేళ్లుగా చందుతో ప్రేమలో ఉంది ఆ మహిళ. కొన్ని వారాల క్రితం పూణెకు వెళ్లి వచ్చేసరికి చందుకు వేరే మహిళతో పెళ్లి అయిపోయింది. కుటుంబ ఒత్తిళ్ల కారణంగా పెళ్లి చేసుకున్నానని, భార్యకు విడాకులిచ్చి కచ్చితంగా తననే వివాహం చేసుకుంటానని మాటిచ్చాడు. అలా ఆత్మహత్యకు యత్నించారు. కానీ, చందు ఒక్కడే మృతి చెందినట్లు ఎంక్వైరీలో తేలింది.