Joshimath Sinking : రోడ్లపై పగుళ్లు, కూలుతున్న ఇళ్లు, కుంగుతున్న భూమి.. జోషిమఠ్‌లో అసలేం జరుగుతోంది? ఈ భయానక పరిస్థితులకు కారణం ఏంటి?

అసలు జోషిమఠ్ లో ఎందుకిలా జరుగుతోంది? భూమి ఎందుకు అంతలా కుంగుబాటుకు గురవుతోంది? అనేది పరిశీలిస్తే.. ప్రకృతి ప్రకోపం ప్రధానంగా చర్చకు వస్తోంది. పర్వత ప్రాంతమైన జోషిమఠ్ లో విచ్చల విడిగా భవన నిర్మాణాలు, అడ్డూ అదుపు లేకుండా కొండలు తవ్వేయడమే ఇప్పుడీ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

Joshimath Sinking : రోడ్లపై పగుళ్లు, కూలుతున్న ఇళ్లు, కుంగుతున్న భూమి.. జోషిమఠ్‌లో అసలేం జరుగుతోంది? ఈ భయానక పరిస్థితులకు కారణం ఏంటి?

Joshimath Sinking : కృష్ణుడు పాలించిన ద్వారక సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సముద్ర గర్భం నుంచి పలు అవశేషాలు బయటపడితే ద్వారక మునిగిపోవటం నిజమని మనం తెలుసుకున్నాం. పురావస్తు శాస్త్రవేత్తలు ద్వారక చరిత్రపై ఎన్నో ఆసక్తికర విశేషాలను వెల్లడించారు. ఇది చరిత్ర. అప్పుడేం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ, అప్పుడు ద్వారకలానే ఇప్పుడు మరో పట్టణం చరిత్రలో కలిసిపోతోంది. ఓ చారిత్రక పట్టణం రోజురోజుకు భూమి పొరల్లోకి కుంగిపోతోంది. ఏమిటీ వైపరిత్యం? అసలు ఎందుకిలా జరుగుతోంది?

జోషిమఠ్.. ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పట్టణం. పరమ పవిత్రంగా భావించే చార్ దామ్ యాత్రల్లో ఒకటైన బద్రినాథ్ క్షేత్రానికి ముఖ ద్వారం జోషిమఠ్. అంతేకాదు, అది శంకరాచార్యులు నెలకొల్పిన నాలుగు పీఠాల్లో ఒకటి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ పర్వత శిఖరం ఇప్పుడు పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. రోజురోజుకు కాలగర్భంలో కలిసిపోయేలా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

Joshimath Sinking

జోషిమఠ్ పట్టణంలో గత కొన్నేళ్లుగా భూమి పగుళ్లు ఇస్తోంది. నేల చీరటంతో ఇళ్లు బీటలు వారుతున్నాయి. భూమి లోపల నుంచి వస్తున్న ఏవేవో శబ్దాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఉన్నట్టుండి భూగర్భం నుంచి ఉబికి వస్తున్న నీరు జోషిమఠ్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జోషిమఠ్ ప్రమాదకర స్థితికి చేరుకుంటోందని 50ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలు హెచ్చరించారట.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అప్పట్లో ఊరు భూమిలో కలిసిపోతుందని చెప్పిన శాస్త్రవేత్తలకు శాపనార్థాలు పెట్టిన స్థానికులు ఇప్పుడు జరుగుతున్నది చూసి ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా జోషిమఠ్ లో కాళ్ల కింద భూమి కదులుతోంది. రోజురోజుకి ఇళ్లు భూగర్భంలోకి దిగిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితం జోషిమఠ్ లో 561 ఇళ్లు పగుళ్లు తేలాయి. గంటగంటకు ఇవి పెద్దవి అవుతున్నాయి.

Joshimath Sinking

అసలు జోషిమఠ్ లో ఎందుకిలా జరుగుతోంది? భూమి ఎందుకు అంతలా కుంగుబాటుకు గురవుతోంది? అనేది పరిశీలిస్తే.. ప్రకృతి ప్రకోపం ప్రధానంగా చర్చకు వస్తోంది. పర్వత ప్రాంతమైన జోషిమఠ్ లో విచ్చల విడిగా భవన నిర్మాణాలు, అడ్డూ అదుపు లేకుండా కొండలు తవ్వేయడమే ఇప్పుడీ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

Also Read..Joshimath Sinking : ద్వారకలానే.. చరిత్రలో కలిసిపోనున్న మరో చారిత్రక పట్టణం..! జోషిమఠ్‌లో భయం భయం

జోషిమఠ్ లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న కట్టడాలు, రోడ్ల నిర్మాణానికి బండ రాళ్ల తొలగింపు ఎప్పటికైనా ప్రమాదం అని 1976లోనే శాస్త్రవేత్తలు నివేదికలు ఇచ్చారట. అప్పుడు ఆ నివేదికలను తప్పుపట్టడమే కాక తమ ఊరు కాలగర్భంలో కలిసిపోతుందన్న శాస్త్రవేత్తలకు శాపనార్ధాలు పెట్టారట. ఆ నివేదికలను చెత్త బుట్టలో వేసేశారట. అవే నివేదికలు ఇప్పుడు నిజమవుతున్నాయని పాతతరం వారు గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు, తరుచుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విరిగిపడే కొండచరియలు, దెబ్బతిన్న సమతౌల్యం కూడా జోషిమఠ్ కుంగుబాటకు కారణం అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Joshimath Sinking

ఇప్పుడే కాదు 2021లో కూడా జోషిమఠ్ లో ప్రమాదకర స్థాయిలో కొండచరియలు విరిగిపడ్డాయి. జోషిమఠ్ నుంచి బద్రీనాథ్ మార్గంలో అకస్మాత్తుగా బండరాళ్లు పడి ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు కూడా జోషిమఠ్ ల పగుళ్లు వచ్చాయి. కనుమరుగయ్యే ప్రమాదం ఉన్న జోషిమఠ్ ను ఆదుకోవటం వీలు కాదా? ఈ పరిస్థితిని నివారించి స్థానికులకు ఉపశమనం కలిగించటం కుదరదా? ఇప్పుడు ఈ ప్రశ్నలపైనే శాస్త్రవేత్తలు మరోసారి పరిశోధనలు చేస్తున్నారు.

రెండు రోజులుగా జోషిమఠ్ లో వస్తున్న మార్పులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం శాస్త్రవేత్తలను ఆదేశించింది. ఏది ఏమైనా ఇండో టిబెటన్ బోర్డర్ లో ఉన్న ఈ చారిత్రక పట్టణం మానవాళి తప్పిదంతోనే చరిత్ర పుటల్లోకి చేరిపోతుందనే విషయం తేటతెల్లమవుతోంది. అందుకే, ప్రకృతి సమతౌల్యత దెబ్బతీయకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు పర్యావరణ నిపుణులు.