Drug Case : ఆర్యన్ ఖాన్ కు జైలా ? బెయిలా ?
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో షారుఖ్ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ కస్టడీ ముగుస్తుంది. ఆర్యన్ ఖాన్ను 2021, అక్టోబర్ 07వ తేదీ గురువారం సిటీ కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి.
Aryan Khan Get Bail : ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో షారుఖ్ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ కస్టడీ నేటితో ముగుస్తుంది. ఆర్యన్ ఖాన్ను 2021, అక్టోబర్ 07వ తేదీ గురువారం సిటీ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. అతడికి బెయిల్ వస్తుందా ? లేక కస్టడీ మరింత పొడిగిస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఎన్సీబీ అధికారుల విచారణలో కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ సప్లయి చేసిన పెడలర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు అధికారులు. మరోవైపు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నాడని ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటున్నారు అధికారులు. వీటిని కోర్టుకు అందజేయనున్నట్టు సమాచారం.
Read More : Pigeon Racing Dispute: పావురాల రేసులో హత్య.. జీవిత ఖైదు, లక్ష జరిమానా
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్టు విచారణలో ఒప్పుకున్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చెప్తున్నారు. ఆర్యన్ ఖాన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆర్యన్ ఖాన్కు మిగతా పరీక్షలు ఏమీ చేయలేదంటున్నారు. డ్రగ్స్ తీసుకున్నానని ఆర్యన్ ఒప్పుకోవడంతో పరీక్షల అవసరం లేదని ఎన్సీబీ భావిస్తోంది. సాధారణ వైద్య పరీక్షలు మాత్రమే నిర్వహించినట్టు సమాచారం. ఇక ఆర్యన్కు సంబంధించి రెండో ఆధారం అతని మొబైల్ ఫోన్. ఇప్పటికే ఫోన్లో కాలింగ్, చాట్స్ గురించి ఆరా తీస్తున్నారు.
షిప్ పార్టీలో డ్రగ్స్ తీసుకునేందుకు ముందుగా ప్లాన్ చేసుకున్నారని వాట్సాప్లో దీనిపై చర్చ జరిగిందంటున్నారు. ఆర్యన్ స్నేహితుడు డ్రగ్స్ సేవించడంపై ముందుగానే చెప్పినట్టు తెలిసిందంటున్నారు అధికారులు.
Read More : Sneha Ullal : తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న పిల్లి కళ్ళ పాప..
డ్రగ్స్ ఉంటాయని తన స్నేహితుడు చెప్పడంతో ఆర్యన్ ఖాన్ అందుకు అంగీకరించినట్టు చాటింగ్లో ఉందంటున్నారు. ఈ చాట్స్ కేసులో కీలకంగా మారనున్నాయని చెప్తున్నారు. మరోవైపు తాము షిప్పై దాడికి వెళ్లినప్పుడు అక్కడ…బాలీవుడ్ సెలబ్రిటీలు ఉంటారని సమాచారం లేదన్నారు. అక్కడికి షారుఖ్ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ వస్తాడని కూడా తేలిదన్నారు. తమకు కేవలం రేవ్ పార్టీ గురించి సమాచారం అందిందని…ఆర్యన్ ఖాన్ వచ్చాడని తెలియడంతో ఫాలో చేశామన్నారు. అయితే ఓ క్యాబిన్లో అతని స్నేహితుడి వద్ద డ్రగ్స్ గుర్తించామన్నారు ఎన్సీబీ అధికారులు.