అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నట్లు జగన్ చెప్పలేదు : కొడాలి నాని

ఏపీలో రాజధాని అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. రాజధాని అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తుడిచిపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 01:37 AM IST
అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నట్లు జగన్ చెప్పలేదు : కొడాలి నాని

ఏపీలో రాజధాని అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. రాజధాని అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తుడిచిపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో

ఏపీలో రాజధాని అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. రాజధాని అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తుడిచిపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రులు చెబుతుంటే.. రాజధానిని తరిలించి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నట్లు మేం ఎక్కడా చెప్పలేదని.. అమరావతితో పాటు మరో రెండు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తే వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్‌తో రాజధాని కట్టాలంటే రూ. లక్షా 15వేల కోట్లు అవసరం అవుతాయని.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది సాధ్యపడదని పేర్కొన్నారు. రాష్ట్ర అప్పును 90వేల కోట్ల రూపాయల నుంచి 3 లక్షల 50వేల కోట్లకు చంద్రబాబు పెంచారన్నారు.

రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు అవసరం లేదని.. ప్రస్తుతం పెండింగ్‌ పనులు పూర్తి చేసి పాలనపై దృష్టి పెడితే చాలన్నారు. ఏపీ అంటే.. వ్యాపారవేత్తలు వెయ్యి కిలోమీటర్లు పరిగెత్తే పరిస్థితికి తెచ్చారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాలు మారితే రాజధానులు మార్చడమేంటని ప్రశ్నించారు. రాజధానిని ఒక్క ఇంచు మార్చిన ఊరుకునేది లేదని సుజనా హెచ్చరించారు

సుజనా చౌదరి వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సుజనా మాట ఏమైనా శాసనమా అంటూ విమర్శించారు. ఈ విషయాలు ప్రధాని మోడీ మీ చెవిలో చెప్పారా అంటూ ప్రశ్నించారు. ఏపీలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆ దిశగా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. 

ఐదేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు ఏపీకి ఏం చేశారని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. తనను ఎన్నుకున్న ప్రజల కోసం ఏనాడైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టారా అని అడిగారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెట్టడం ఆయనకు ఇష్టం ఉందో? లేదో? చెప్పాలన్నారు. ఏపీలో రాజధాని మార్పును కొందరు సమర్ధిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. దీంతో అధికారపక్ష నేతల హామీలు, ఇటు ప్రతిపక్షనేతల వ్యాఖ్యలతో ప్రజలు అయోమయంలో పడిపోయారు. మొత్తంగా మూడు వారాల్లో రాజధాని అంశంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

* అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నట్లు చెప్పలేదు- కొడాలి నాని
* చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ కు రూ.లక్షా 15వేల కోట్లు- కొడాలి నాని
* ఒక్క అంగుళం కూడా కదిలించడానికి వీల్లేదు- సుజనా 
* ప్రభుత్వాలు మారితే రాజధానులు మారుతాయా- సుజనా
* నీ మాట ఏమైనా శాసనమా? వేదమా?- బొత్స
* ప్రధాని మోడీ మీ చెవిలో చెప్పారా- బొత్స
* భూములు త్యాగం చేసిన రైతుల పరిస్థితి ఏం కావాలి- అశోకగజపతి రాజు
* కేంద్ర మంత్రిగా ఏపీకి ఏం చేశావ్- బొత్స

Also Read : పవన్ స్టాండ్ ఏంటీ ? : మూడు రాజధానులకు అనుకూలమా ? వ్యతిరేకమా ?