Karnataka elections 2023: మీ గురించి మాత్రమే చెప్పుకుంటున్నారేంటీ?: మోదీకి రాహుల్ చురకలు

Karnataka elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తురువెకెరెలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు.

Karnataka elections 2023: మీ గురించి మాత్రమే చెప్పుకుంటున్నారేంటీ?: మోదీకి రాహుల్ చురకలు

Rahul Gandhi

Karnataka elections 2023: “ఎన్నికలు మీ కోసం కాదు… కర్ణాటక ప్రజల కోసం” అంటూ ప్రధాని మోదీ (PM Modi)ని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka elections 2023) జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తురువెకెరెలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు.

“గోవా, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య ఉన్న నీటి వివాదాన్ని పరిష్కరించేందుకు బీజేపీ ఏం చేసిందన్న విషయంపై ప్రధాని మోదీ మాట్లాడాలి. కర్ణాటకలో అవినీతిని రూపుమాపేందుకు ఏం చేశామన్న విషయంపై మోదీ మాట్లాడాలి. అంతేగానీ, తన గురించి తాను మాట్లాడుకోవడం కాదు. ఎన్నికల ర్యాలీల్లో కాస్త బీజేపీలోని ఇతర నేతల గురించి కూడా మాట్లాడండి” అని రాహుల్ గాంధీ చురకలు అంటించారు.

“ఈ మూడేళ్లలో కర్ణాటకకు ఏం చేశారు మోదీ జీ? కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దుల వద్ద ఘర్షణలు జరిగినప్పుడు మీరేం చేశారు? కర్ణాటక-గోవా-మహారాష్ట్ర నీటి సమస్య పరిష్కారానికి మీరు చేసిందేంటీ? కర్ణాటకలో వరదలు వచ్చినప్పుడు ఏ సాయం చేశారు? కర్ణాటక అభివృద్ధి కోసం ఏం చేశారో ఏదైనా చెప్పండి” అంటూ రాహుల్ గాంధీ నిలదీశారు.

Karnataka elections 2023: మద్యం వరదను, ధన ప్రవాహాన్ని కట్టడి చేయండి: ఎన్నికల సంఘాన్ని కోరిన ఏపీ