YS Viveka Case : వైఎస్ వివేకా కేసులో సీఎం జగన్ పేరు.. సీబీఐ సంచలనం

YS Viveka Case - CBI : వివేకా హత్య విషయం సీఎం జగన్ కు ఉదయం 6గంటల 15 నిమిషాలకే తెలిసినట్లు దర్యాఫ్తులో తేలిందని సీబీఐ చెప్పింది. ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే జగన్ కు తెలుసని కౌంటర్ అఫిడవిట్ లో వెల్లడించారు సీబీఐ అధికారులు.

YS Viveka Case : వైఎస్ వివేకా కేసులో సీఎం జగన్ పేరు.. సీబీఐ సంచలనం

YS Vivkea Case

YS Viveka Case – CBI : మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో సంచలన విషయాలు ప్రస్తావించింది. అఫిడవిట్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరుని ప్రస్తావించింది సీబీఐ. వివేకా హత్య విషయాన్ని జగన్ కు అవినాశ్ రెడ్డి చెప్పారా? లేదా? అనేదానిపై దర్యాఫ్తు చేయాల్సి ఉందన్నారు సీబీఐ అధికారులు. వివేకా హత్య విషయం సీఎం జగన్ కు ఉదయం 6గంటల 15 నిమిషాలకే తెలిసినట్లు దర్యాఫ్తులో తేలిందని సీబీఐ చెప్పింది. వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి బయట పెట్టకముందే వివేకా మృతి గురించి జగన్ కు తెలుసని కౌంటర్ అఫిడవిట్ లో వెల్లడించారు సీబీఐ అధికారులు.

అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో సీబీఐ కీలక అంశాలు వెల్లడించింది. అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీబీఐ.. విచారణకు అవినాశ్ రెడ్డి సహకరించడం లేదంది. ఇప్పటివరకు జరిగిన విచారణలో అవినాశ్ రెడ్డి పొంతనలేని సమాధానాలు చెప్పారని సీబీఐ అధికారులు తెలిపారు.

అవినాశ్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని సీబీఐ తెలిపింది. అవినాశ్ రెడ్డి విచారణకు సహకరించడం లేదంది. హత్య వెనక భారీ కుట్ర చెప్పేందుకు అవినాశ్ ముందుకు రావడం లేదంది. హత్య జరిగిన రాత్రి 12.27 నుంచి 1:10 వరకు అవినాశ్ వాట్సాప్ కాల్స్ మాట్లాడారంది. (YS Viveka Case)

” ఈ నెల 15న నోటీస్ ఇస్తే నాలుగు రోజుల సమయం కావాలన్నారు. ఈ నెల 16న నోటీస్ ఇస్తే తల్లి అనారోగ్యం వల్ల రాలేనన్నారు. ఈ నెల 19న తల్లి అనారోగ్యం నెపంతో ఉద్దేశపూర్వకంగా హైదరాబాద్ విడిచి వెళ్లారు. విచారణకు రావాలని అవినాశ్ కు ఫోన్ చేసి కోరినప్పటికీ రాలేదు.
ఈ నెల 22న రావాలని నోటీస్ ఇస్తే తల్లి అనారోగ్యం వల్ల వారం రోజులు రానన్నారు. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఈనెల 22న సీబీఐ బృందం కర్నూలు వెళ్ళింది. ఆస్పత్రి వద్ద అవినాశ్ అనుచరులు భారీగా ఉండడంతో శాంతిభద్రల సమస్య రావచ్చని అనిపించింది. జూన్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉన్నందున అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు” అని కౌంటర్ అఫిడవిట్ లో సీబీఐ కోరింది.

Also Read..YS Viveka case: అవినాశ్ రెడ్డితో మాట్లాడాను.. హత్య కేసులో హస్తం ఉందా? లేదా? అని అడిగాను: కేఏ పాల్

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్ పేరుని సీబీఐ ప్రస్తావించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటివరకు కడప ఎంపీ అవినాశ్ పాత్ర ఉన్నట్లుగా సీబీఐ అధికారులు అనేకసార్లు ఆయనకు నోటీసులు ఇచ్చారు. దాన్ని సవాల్ చేస్తూ అవినాశ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు. తాజాగా తన తల్లి ఆరోగ్యం దృష్ట్యా విచారణకు హాజరుకాలేనంటూ, ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అవినాశ్ రెడ్డి. దీనిపై నిన్న(మే 25) విచారించిన కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవాళ(మే 26) సుదీర్ఘంగా 7గంటల పాటు తెలంగాణ హైకోర్టు విచారించింది. అవినాశ్ తరపు న్యాయవాది సుదీర్ఘంగా 5గంటల పాటు వాదనలు వినిపించారు.(YS Viveka Case)

ఇక ఈ రోజు అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ లో సీబీఐ అధికారులు అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో సీబీఐ అధికారులు ఏపీ సీఎం జగన్ పేరును ప్రస్తావించారు. 6.15 గంటల ప్రాంతంలో వివేకా హత్య జరిగినట్లు పీఏ కృష్ణారెడ్డికి తెలిసినప్పటికి కూడా అతడు చెప్పకుండానే సీఎం జగన్ కి ఏ విధంగా తెలిసింది? అవినాశ్ రెడ్డే చెప్పారా? లేక మరెవరైనా సీఎం జగన్ కి చెప్పారా? దీనికి సంబంధించి పూర్తి దర్యాఫ్తు చేయాల్సిన అవసరం ఉందని సీబీఐ తెలిపింది.(YS Viveka Case)

ముఖ్యమంత్రి జగన్ కి ఏ విధంగా హత్య గురించి తెలిసింది? ఎన్ని గంటలకు తెలిసింది? అనేదానిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. వివేకా పీఏ కృష్ణారెడ్డి చెప్పలేదు. మరి జగన్ కు ఎవరు చెప్పి ఉంటారు? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై పూర్తి దర్యాఫ్తు చేయాల్సి ఉందని కౌంటర్ అఫిడవిట్ లో సీబీఐ స్పష్టంగా పేర్కొంది.