14ఏళ్లు సీఎంగా ఉండి, ఎన్టీఆర్కి భారతరత్న ఎందుకు ఇప్పించుకోలేకపోయావు బాబూ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబుని టార్గెట్ చేశారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇప్పించానని కోతలు కోస్తున్న చంద్రబాబు, 14 ఏళ్లు సీఎంగా ఉండి ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకు ఇప్పించుకోలేకపోయారని విజయసాయిరెడ్డి చంద్రబాబుని ప్రశ్నించారు. అంటే రాష్ట్రపతులు, ప్రధానులను ఎంపిక చేయడం అబద్ధాలైనా అయి ఉండాలి లేదంటే ఎన్టీఆర్ కు అత్యున్నత పురస్కారం దక్కకుండా అడ్డుకోనైనా ఉండాలి. ఇందులో ఏది నిజం బాబూ? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించానని కోతలు కోస్తున్న బాబు 14 ఏండ్లు సిఎంగా ఉండి ఎన్టీఆర్ కు అత్యున్నత పురస్కారం ఎందుకు ఇప్పించుకోలేక పోయాడు. రాష్ట్రపతులు, ప్రధానులను ఎంపిక చేయడం అబద్ధాలైనా అయి ఉండాలి. ఎన్టీఆర్ కు దక్కకుండా అడ్డుకోనైనా ఉండాలి. ఇందులో ఏది నిజం బాబూ.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 5, 2020
కరోనా వ్యాక్సిన్ తయారీ విషయంలోనూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబుకి గొలుసులు వేయాల్సిందే అని కామెంట్ చేశారు.
ఆశ్చర్యం లేదు. ఊహించిందే. ప్రపంచంలో ఎక్కడ కోవిడ్ వ్యాక్సిన్ తయారైనా తన ఖాతాలో వేసుకుంటాడని. ప్రపంచ ప్రఖ్యాత అమరావతి మాయా నగరం లాగే ఈయన సృష్టించిన బయోటెక్ పార్కులో వ్యాక్సిన్ తయారవుతోందని ప్రజలంతా కృతజ్ఞత వ్యక్తం చేసారట. మైండ్ డీజనరేట్ అవుతోంది. గొలుసులు సిద్ధం చేయాల్సిందే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 5, 2020