Bangladesh vs Zimbabwe T20 Match: రాణించిన నజ్ముల్ శాంటో.. ఉత్కంఠ పోరులో జింబాబ్వేపై బంగ్లాదేశ్ గెలుపు ..
151 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే ఆటగాళ్లు చివరి వరకు పోరాడారు. సిన్ విలియమ్స్ 64 పరుగులతో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించక పోవటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి జింబాబ్వే జట్టు 147 పరుగులు మాత్రమే చేసింది.
Bangladesh vs Zimbabwe T20 Match: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం బ్రిస్బేన్లోని గబ్బాలో జింబాబ్వే వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య T20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు మూడు పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. చివరి వరకు పోరాడిన జింబాబ్వే ఆటగాళ్లు చివరికి షకీబ్ సేన నిర్ధేశించిన లక్ష్యాన్ని చేధించలేక పోయారు. ఈ విజయంతో బంగ్లాదేశ్ జట్టు గ్రూప్-2లో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంకు ఎగబాకింది. మొదటి స్థానంలో ఇండియా నిలిచింది.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత (20) ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో (71) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మిగిలిన వారిలో ఆఫీఫ్ హుస్సేన్ (29), షకీబ్ ఆల్ హసన్ (23) పరుగులు చేశారు. జింబాబ్వే జట్టులో రిచర్డ్ నగరవ, ముజారబానీ తలా రెండు వికెట్లు తీశారు.
What a match! ?
Bangladesh emerge victorious after a thrilling clash against Zimbabwe!#T20WorldCup | #BANvZIM | ?https://t.co/Qi8dhfgeEW pic.twitter.com/qayCpqXi0y
— ICC (@ICC) October 30, 2022
151 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ కు వచ్చిన జింబాబ్వే ఆటగాళ్లు చివరి వరకు పోరాడారు. సీన్ విలియమ్స్ 64 పరుగులు చేసి అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించక పోవటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి జింబాబ్వే జట్టు 147 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మూడు పరుగుల తేడాతో బంగ్లా జట్టు విజయం సాధించింది. బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీసి 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముస్తాఫీజుర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీశాడు.