Homemaker Win Gold Medal : జాతీయ బాడీ బిల్డింగ్ పోటీల్లో.. గోల్డ్ మెడల్ సాధించిన థైరాయిడ్‌తో పోరాడుతున్న గృహిణి

థైరాయిడ్‌తో పోరాడుతున్న ఓ గృహిణి జాతీయ బాడీబిల్డింగ్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్హావాల్ కు చెందిన ప్రతిభా తప్లియాల్ (41) అనే గృహిణి 13వ నేషనల్ సీనియర్ ఉమెన్స్ బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించారు.

Homemaker Win Gold Medal : జాతీయ బాడీ బిల్డింగ్ పోటీల్లో.. గోల్డ్ మెడల్ సాధించిన థైరాయిడ్‌తో పోరాడుతున్న గృహిణి

woman

Homemaker Win Gold Medal : థైరాయిడ్‌తో పోరాడుతున్న ఓ గృహిణి జాతీయ బాడీబిల్డింగ్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్హావాల్ కు చెందిన ప్రతిభా తప్లియాల్ (41) అనే గృహిణి 13వ నేషనల్ సీనియర్ ఉమెన్స్ బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇటీవల ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రత్లామ్ లో నేషనల్ సీనియర్ ఉమెన్స్ బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ నిర్వహించారు. ఇద్దరు పిల్లలు కలిగి ఉన్న ప్రతిభా తప్లియాల్ పోటీల్లో పాల్గొన్న రెండోసారికే గోల్డ్ మెడల్ సాధించారు.

గత 5 సంవత్సరాల నుంచి ఆమె థైరాయిడ్ తో బాధపడుతున్నారు. 2018లో థైరాయిడ్ లెవెల్ 5 నుంచి 50కి పెరిగాయని ఆమె చెప్పారు. డాక్టర్లు తనకు వర్కౌట్ చేయాలని సలహా ఇచ్చారని తెలిపారు. దీంతో ఆమె తన భర్త భూపేష్ తో కలిసి స్థానిక జిమ్ లో చేరారు. ఆమె కొన్ని నెలల్లోనే 30 కేజీలు తగ్గినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం సిక్కింలో మొదటిసారి బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నారు. ఆమె ఉత్తరాఖండ్ తరపున మొదటి మహిళా ప్రొపెషనల్ బాడీ బిల్డర్ గా పాల్గొన్నారు.

Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్

కాగా, తాను మొదటి సారి బాడీ బిల్డింగ్ ప్రారంభించినప్పుడు చుట్టు ప్రక్కల ఉన్న మహిళలు తనను ఎగతాళి చేశారని చెప్పారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధించానని ఆమె నవ్వుతూ చెప్పారు. భర్త భూపేష్ తన కండరాల్లు, ప్రతిభను గుర్తించి బాడీ బిల్దింగ్ పోటీల్లో పాల్గొనాలని ప్రోత్సహించారని తెలిపారు. భర్త భూపేష్ కూడా తనకు ట్రైనర్ మరియు డైటీషియన్ అని పేర్కొన్నారు.

రిషికేష్ లో స్కూల్, కాలేజీ చదువుతున్న రోజుల్లో ఆమె వాలీబాల్, క్రికెట్ ఆడేవారు. ఆమె పెళ్లి చేసుకునే ముందు కూడా స్టేట్ లెవెల్ వాలీబాల్ టీమ్ కు నాయకత్వం వహించారు. జిమ్ లో ఆమె ప్రతిరోజూ 7గంటలు గడిపేవారు. దాని ఫలితంగా ఆమె పాల్గొన్న రెండోసారికే బంగారు పతకాన్ని సాధించారు. దీన్ని గుర్తించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆమె మంచి శిక్షణ తీసుకొనేందుకు సాయం చేస్తారని భావిస్తున్నారు.

Asian Indoor Championships: ఆసియన్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాలు.. మహిళా పోల్ వాల్ట్‌లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్

ప్రతిభా తప్లియాల్ ఇద్దరు పిల్లలు(15, 17 సంవత్సరాలు) డెహ్రాడూన్ లో 10, 12 తరగతులు చదువుతున్నారు. ఇటీవల పాల్గొన్న చాంపియన్ షిప్ లో వయస్సు పరంగా చూస్తే తాను సీనియర్ నని, అనుభవ రీత్యా చూస్తే జూనియర్ నని తెలిపారు. ఇప్పుడు ప్రతిభా ఏషియన్ మరియు వరల్డ్ చాంపియన్ షిప్ కు సన్నద్ధమవుతున్నారు.