India vs England: నేడు ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సెమీఫైనల్.. ఇండియా-పాక్ ఫైనల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం ఇండియా - ఇంగ్లండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఇండియా గెలిచి ఫైనల్ చేరాలని... అక్కడ పాకిస్తాన్‌ను ఓడించి కప్పు సాధించాలని మన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

India vs England: నేడు ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సెమీఫైనల్.. ఇండియా-పాక్ ఫైనల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

India vs England: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా ఈ రోజు అత్యంత కీలక మ్యాచ్ ఆడబోతుంది. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌లో తలపడబోతుంది. మధ్యాహ్నం 01.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే ఫైనల్ చేరుతుంది.

Sanjay Raut: సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరు.. ఆయన అరెస్టు అక్రమమని కోర్టు వ్యాఖ్య

ఇప్పటికే ఫైనల్ చేరిన పాకిస్తాన్‌తో ఆదివారం జరిగే తుదిపోరులో తలపడుతుంది. దీంతో ఫ్యాన్స్ ఈ రోజు ఇండియా కచ్చితంగా గెలిచి తీరాలని, పాకిస్తాన్‌తో ఫైనల్‌లో తలపడి కప్పు సాధించాలని ఇండియన్స్ ఆశిస్తున్నారు. నేటి మ్యాచ్‌కు సంబంధించి జట్టు బలాబలాల విషయానికొస్తే ఇండియా ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటుండగా, ఇంగ్లండ్ మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. ఐర్లాండ్ వంటి చిన్న జట్టు చేతిలో కూడా ఓడిపోయింది. అంత బలంగా లేని శ్రీలంకపై అతి కష్టం మీద గెలిచింది. అలాగని ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్ రౌండర్లతో జట్టు బలంగానే ఉంది. అందరూ చెలరేగితే అడ్డుకోవడం కష్టం. రోహిత్ ఆధ్వర్యంలోని టీమిండియా బలంగానే ఉంది.

Sania Mirza: సానియా-షోయబ్ ఇప్పటికే విడిపోయారా? అసలు విషయం చెప్పిన స్నేహితులు

సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ చెలరేగితే విధ్వంసమే. కేఎల్ రాహుల్, రోహిత్ కూడా రాణిస్తే బ్యాటింగ్‌లో తిరుగుండదు. మరోవైపు వికెట్ కీపర్ విషయంలోనే స్పష్టత రావాల్సి ఉంది. కొంతకాలంగా దినేష్ కార్తీక్ విఫలమవుతుండటంతో రిషబ్ పంత్‌ను గత మ్యాచ్ కోసం తీసుకున్నారు. కానీ, అతడు కూడా ఆ మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌లో ఇద్దరిలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అలాగే స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా రాణించాల్సి ఉంది. మొత్తానికి ఇవాళ్టి మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే క్రికెట్ ఫ్యాన్స్‌కి పండగే. ఆదివారం ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ఫుల్ కిక్కు ఇస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇండియా-పాక్ మాత్రమే కాదు.. ఇతర దేశాల్లోని క్రికెట్ అభిమానులు కూడా ఆసక్తికరంగా ఎదురు చూసే మ్యాచ్ అవుతుంది.