Ravindra Jadeja: ‘జడేజాను చూసి రోహిత్ శర్మ భయపడే ఇలా చేశాడు’

శ్రీలంకతో తొలి టెస్టు జరుగుతున్న క్రమంలో రవీంద్ర జడేజా నమోదు చేసిన స్కోరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అజేయంగా 175పరుగులు బాదేశాడు జడేజా.

Ravindra Jadeja: ‘జడేజాను చూసి రోహిత్ శర్మ భయపడే ఇలా చేశాడు’

Rohit Sharma Jadeja

Ravindra Jadeja: శ్రీలంకతో తొలి టెస్టు జరుగుతున్న క్రమంలో రవీంద్ర జడేజా నమోదు చేసిన స్కోరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అజేయంగా 175పరుగులు బాదేశాడు జడేజా. క్రీజులో ఉండగానే 574/8వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది టీమిండియా. ఈ నిర్ణయం తీసుకోవడంపై రోహిత్ శర్మను తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.

ఇంకొంచెం సేపు క్రీజులో ఉంటే రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్ చేస్తాడనిపించి అలా చేసి ఉంటాడంటూ నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు. మరికొందరు ద్రవిడ్ గతంలో డిక్లేర్ చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. పాకిస్తాన్ తో జరిగిన ముల్తాన్ టెస్ట్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 194పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సంగతి గుర్తు చేస్తున్నారు.

మరో రికార్డ్ బ్రేక్ చేశాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కెరీర్‌లోనే బెస్ట్ స్కోరు నమోదు చేశాడు. టెస్టు ఫార్మాట్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 175 పరుగులు చేసి ఘనత సృష్టించాడు. 35ఏళ్ల క్రితం కపిల్ దేవ్ 163 పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. శ్రీలంకతో 1986 డిసెంబరులో కాన్పూర్ వేదికగా ఈ రికార్డ్ నమోదు చేశారు కపిల్ దేవ్.

Read Also : రవీంద్ర జడేజా భార్య ఎవరు? జీతమెంత? ఆస్తులెన్ని? సీఎస్‌కే ఆల్ రౌండర్ పర్సనల్ లైఫ్ గురించి అభిమానుల ఆరా