UP Government : క్రీడాకారులపై యోగి కనకవర్షం..టోక్యో బలంపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిస్తే రూ. 6 కోట్లు

జులై-23 నుంచి ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌‌లో పతకాలు సాధించే ఉత్తరప్రదేశ్ క్రీడాకారులపై యోగి సర్కార్ కనకవర్షం కురిపించనుంది.

UP Government : క్రీడాకారులపై యోగి కనకవర్షం..టోక్యో బలంపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిస్తే రూ. 6 కోట్లు

Yogi

UP Government జులై-23 నుంచి ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌‌లో పతకాలు సాధించే ఉత్తరప్రదేశ్ క్రీడాకారులపై యోగి సర్కార్ కనకవర్షం కురిపించనుంది. వ్యక్తిగత ఈవెంట్లలో(individual category) గోల్డ్ మెడల్ సాధించేవారికి రూ. 6 కోట్లు బహుమతిగా అందించనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. వెండి పతకం సాధించేవారికి 4 కోట్ల రూపాయలు, కాంస్య పతకం సాధించేవారికి 2 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఇక, టీం ఈవెంట్లలో గోల్డ్ మెడల్ సాధించేవారికి రూ. 3 కోట్లు, సిల్వర్ మెడల్ సాధించేవారికి రూ. 2 కోట్లు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి రూ.1 కోటి ఇస్తామని యోగి సర్కార్ ప్రకటించింది. అంతేకాకుండా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ప్రతి యూపీ క్రీడాకారుడికి రూ. 10 లక్షలు ఇస్తామని యూపీ సర్కార్ ప్రకటించింది. పతకాలు గెలిచినా, గెలవకున్నా ఈ నజరానా క్రీడాకారులకిస్తారు.

క్రీడాకారుల కోసం యోగి సర్కార్ నాలుగేళ్లుగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఒలింపిక్స్‌ వంటి క్రీడా పోటీలను దృష్టిలో ఉంచుకుని నాలుగేళ్ల నుంచే క్రీడాకారుల కోసం 44 హాస్టళ్లు, స్టేడియాలు నిర్మించింది. పాత వాటికి మరమ్మతులు కూడా చేయించింది. 19 జిల్లాల్లో క్రీడాకారుల కోసం ప్రత్యేక కోచ్‌లతో శిక్షణ ఇప్పిస్తోంది. రూ.1000 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను రెండున్నర వేల కోట్ల రూపాయలకు పెంచింది.

మరోవైపు,హర్యానా,తమిళనాడు,ఒడిషా సహా పలు రాష్ట్రాలు టోక్యో ఒలంపిక్స్ లో పతకాలు సాధించే క్రీడాకారులకు నగదు బహుమతలును ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.