Urvashi Rautela: రిషబ్ పంత్ చికిత్స పొందుతున్న హాస్పిటల్ పిక్ షేర్ చేసిన ఊర్వశి.. మండి పడుతున్న నెటిజన్లు
టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ తనను ఇష్టపడుతున్నట్లు ఊర్వశి పలుసార్లు సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా వెల్లడించింది. ఊర్వశి కూడా అనేకసార్లు రిషబ్ పంత్ పేరు పరోక్షంగా ప్రస్తావించింది. రిషబ్ పంత్ మాత్రం ఆమెతో తనకేం సంబంధం లేదని, తనను వదిలేయాలని పేర్కొన్నాడు.
Urvashi Rautela: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాపై నెటిజన్లు మండి పడుతున్నారు. కారణం.. ఆమె రిషబ్ పంత్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడమే. టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ తనను ఇష్టపడుతున్నట్లు ఊర్వశి పలుసార్లు సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా వెల్లడించింది.
ఊర్వశి కూడా అనేకసార్లు రిషబ్ పంత్ పేరు పరోక్షంగా ప్రస్తావించింది. రిషబ్ పంత్ మాత్రం ఆమెతో తనకేం సంబంధం లేదని, తనను వదిలేయాలని పేర్కొన్నాడు. అయితే, ఇద్దరూ ఒకరి గురించి ఒకరు నేరుగా ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఇటీవల రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ఊర్వశి రౌతేలా తన ఇన్స్టాగ్రామ్లో కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రి ఫొటోను షేర్ చేసింది. దీని ద్వారా పరోక్షంగా రిషబ్ పంత్ ప్రస్తావన తెచ్చింది. దీంతో నెటిజన్లు ఊర్వశిపై విమర్శలు గుప్పిస్తున్నారు. రిషబ్ పంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే, అతడ్ని ఇలా పరోక్షంగా వేధించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Weather Report: తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత… ఏపీకి స్వల్ప వర్ష సూచన
ఇది మానసిక వేధింపుల కిందకే వస్తుందంటూ సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్నారు. ఊర్వశిలాగా ఇంకెవరైనా మగవాళ్లు వేధింపులకు పాల్పడితే, ఈపాటికే జైళ్లో వేసేవాళ్లని, గెట్వెల్సూన్ ఊర్వశి అని వ్యాఖ్యానిస్తున్నారు. బాలీవుడ్లో పలు చిత్రాలు చేసిన ఊర్వశి తాజాగా తెలుగులో ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవితో కలిసి ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది.