విద్యుత్ తీగలు తెగిపడి 8 ఎకరాల పంట దగ్ధం
నిర్మల్ జిల్లా దస్తురబాద్ మండలంలో 11కెవి విద్యుత్ తీగలు తెగిపడి 8 ఎకరాల పంట దగ్ధమైంది. సకాలంలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో గ్రామంలోకి మంటలు వ్యాపించలేదు. ఈ ప్రమాదంలో దాదాపు లక్షా 50వేల నష్టం వాటిళ్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
విద్యుత్ తీగలు కిందికి వేలాడుతున్నాయని… స్తంభాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని.. అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.