Mahesh Kumar Goud : కాంగ్రెస్ ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కుట్ర : మహేష్ కుమార్ గౌడ్

మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా? అని అన్నారు. మళ్ళీ గడీల పాలన కొసాగుతోందన్నారు.

Mahesh Kumar Goud : కాంగ్రెస్ ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కుట్ర : మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud

Hyderabad Gandhi Bhavan : తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.  సోనియా గాంధీ చొరవ వల్లే రాష్ట్ర వచ్చిందని తెలిపారు. కానీ, రాష్ట్ర ప్రజలు ఆకాంక్షలు నెరవేరలేదని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం తప్ప సామాన్యుడికి ఒరిగిందేమి లేదన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

జాతీయ జెండాను వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎగరేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు మాణిక్ రావు ఠాక్రె, ఉత్తమ్, వీహెచ్, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, బలరాం నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమి ఏమైంది? ఉద్యోగాలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.

CM KCR : తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం నా అదృష్టం : సీఎం కేసీఆర్

మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా? అని అన్నారు. మళ్ళీ గడీల పాలన కొసాగుతోందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. కవిత విషయంలో అది నిరూపితమైందన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కి ప్రజలు పట్టం కడుతారని ధీమా వ్యక్తం చేశారు. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. నిజమైన బంగారు తెలంగాణ కాంగ్రెస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు.