CM KCR Munugode Campaign : 3 రోజులు మునుగోడులోనే.. స్వయంగా రంగంలోకి కేసీఆర్, ఎన్నికల ప్రచారం చేయనున్న గులాబీ బాస్

వచ్చీరాగానే మునుగోడులో ఎన్నికల ప్రచారంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ నెల 28,29,30న మునుగోడులో బస్సు యాత్ర, రోడ్ షో లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

CM KCR Munugode Campaign : 3 రోజులు మునుగోడులోనే.. స్వయంగా రంగంలోకి కేసీఆర్, ఎన్నికల ప్రచారం చేయనున్న గులాబీ బాస్

CM KCR Munugode Campaign : 9 రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. వచ్చీరాగానే మునుగోడులో ఎన్నికల ప్రచారంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ నెల 28,29,30న మునుగోడులో బస్సు యాత్ర, రోడ్ షో లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇక మూడు రోజుల పాటు మునుగోడులో బస్సు యాత్రకు ఏర్పాట్లు చేయాలని నేతలను కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 30న చండూరులో భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు రేపటి నుంచి వరుసగా మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నెల 25 నుంచి టీఆర్ఎస్ కీలక నేతలు మునుగోడులోనే మకాం వేయనున్నారు. రోడ్ షో లు, ర్యాలీలతో హోరెత్తించనున్నారు.