CM KCR : రఫేల్ డీల్ పెద్ద స్కామ్.. సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తాం-కేసీఆర్ సంచలనం
మమ్మల్ని కాదు... మిమ్మల్ని జైల్లో వేయడం మాత్రం పక్కా! కేంద్రం అవినీతిపై భయంకరమైన చిట్టా ఉంది. మొత్తం బద్దలు కొడతాం. రాఫెల్ డీల్ పై సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నాం.

Kcr Rafale Scam
CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ తగ్గేదేలే అంటున్నారు. ప్రధాని మోదీతో సమరానికి సై అంటున్నారు. ప్రధాని మోదీని, బీజేపీ నేతలను టార్గెట్ చేసిన కేసీఆర్.. మరోసారి వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. బీజేపీ మస్ట్ గో… బీజేపీ ఈ దేశం నుంచి వెళ్లిపోవాలంతే అంటూ మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉండడానికి వీల్లేదని అన్నారు. ఇప్పటికే బీజేపీ చేసిన పాపాలు ఎక్కువైపోయాయని, మోదీకి ఇచ్చిన సమయంలో 80 శాతం అయిపోయిందని కేసీఆర్ అన్నారు.
“విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, మేహుల్ చోక్సీ వంటి వ్యక్తులు ఏం చేశారో తెలియదా? ఆర్థిక నేరాలకు పాల్పడి దేశాన్ని విడిచి పారిపోయిన వాళ్లంతా మోదీ దోస్తులే. ఎవడైనా మగాడు ఈ అంశాలపై మాట్లాడాలి. ఇవన్నీ వదిలిపెట్టి నన్ను జైలుకు పంపుతామని అంటున్నారు. వీళ్లను చూస్తే నిజంగా జాలి కలుగుతుంది… దమ్మున్న వాళ్లయితే నన్ను జైల్లో వేసి చూడండి. అయినా తప్పు చేసినోళ్లే అలాంటి మాటలకు భయపడతారు. నాకా భయం లేదు. జైల్లో వేస్తా అనగానే తోకగాళ్లు భయపడతారు కానీ, మాకేం భయం!
మమ్మల్ని కాదు… మిమ్మల్ని జైల్లో వేయడం మాత్రం పక్కా! కేంద్రం అవినీతిపై భయంకరమైన చిట్టా ఉంది. మొత్తం బద్దలు కొడతాం. దేశంలో రాఫెల్ కుంభకోణం బయటకు రావాలి. అందులో దొంగలు బయటపడాలి. రాఫెల్ డీల్ స్కామ్ గురించి రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. మేం కూడా సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నాం. మోదీ సర్కారు దీంట్లో వేల కోట్లు మింగింది. ఈ దొంగతనాన్ని మేం బయటపెడతాం. రాఫెల్పై రాహుల్ గాంధీ మాట్లాడితే ఆయనపై ఈడీ, సీబీఐ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు.
Sleep : అతిగా నిద్రపోతున్నారా!…అయితే జాగ్రత్త?
కేంద్ర ప్రభుత్వం 36 రాఫెల్ యుద్ధ విమానాలను 9.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. నిన్న ఇండోనేషియా దేశం 42 రాఫెల్ యుద్ధ విమానాలను కేవలం 8 బిలియన్ డాలర్లకే కొన్నది. మనకంటే తక్కువ ధరకే కొనుగోలు చేసింది. పైగా ఇండోనేషియా 6 విమానాలు ఎక్కువగా కొనుగోలు చేసింది. ఇప్పుడు తెలియడం లేదా ఎవడు దొంగ అనేది? ఎవడు జైలుకు పోతాడో వాడే పోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ అంశాన్ని వదలను. ఢిల్లీలో దీనిపై వందశాతం పంచాయితీ పెడతాం” అని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
”ఐ యామ్ ఏ ట్రోల్ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడు పోతోంది. బీజేపీ ప్రభుత్వం వల్ల దేశం పరువుపోతోంది. మోదీ ప్రభుత్వంలో తప్పించుకున్న దొంగలు విదేశాల్లో దాకుంటున్నారు. వీళ్లంతా మోదీ దోస్తులు… గుజరాత్ వాళ్లు కాదా? ఇది మీ ఘనత కాదా? నేను జైలుకు అని అంటున్నారు. దమ్ముందా? నన్ను జైలుకు పంపండి. రాఫెల్ డీల్ పై సుప్రీంకోర్టులో కేసు వేస్తాం. రాఫెల్ డీల్ పెద్ద కుంభకోణం కాదా? ఎవరు జైలుకి వెళ్లాలో వాళ్లే వెళ్తారు. ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టిస్తారు. సిగ్గు లేకుండా గెలువకున్నా పరిపాలిస్తున్నారు. దేశంలో అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు” అని నిప్పులు చెరిగారు కేసీఆర్.
Realme C35 Phone : రూ.13 వేలకే రియల్మీ కొత్త ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరా..!
”అమెరికా ఎన్నికల్లో ప్రచారానికి మోదీ ఎందుకు వెళ్లారు? అది ఏమైనా అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలా? ఎన్నికలు ముగిశాయి… మన పరువు పోయింది. వైట్ హౌస్ లో పలికే వారు లేకుండా పోయారు” అని కేసీఆర్ అన్నారు.