Crossfire: తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అడవుల్లో.. మావోయిస్టులు.. గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో.. ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని సమాచారం.

Crossfire: తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి!

Encounter (2)

Crossfire: తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అడవుల్లో.. మావోయిస్టులు.. గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో.. ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని సమాచారం.

మావోయిస్టుల కార్యకలాపాలపై సమాచారం అందుకున్న బలగాలు విస్తృతంగా కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో.. ఇరు వర్గాలు తారసపడగా.. ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టు సమాచారం.

చలికాలం కావడంతో.. మావోయిస్టులు అడవులు వీడుతున్నారన్న సమాచారంతో.. పోలీసులు చర్ల మండల పరిధిలోని అడవులను జల్లెడపడుతున్నారు. ఈ క్రమంలో నేటి ఎదురు కాల్పుల ఘటన అనంతరం.. మరింతగా కూంబింగ్ ను కొనసాగిస్తున్నారు. మరోవైపు.. తాజా ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.