Revanth Reddy : ఒక్కొక్కరికి రూ.5లక్షలు ఇస్తాం, ఒక్క ఛాన్స్ ప్లీజ్-రేవంత్ రెడ్డి

2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇళ్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. పేదలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకుంటాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం'' అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.(Revanth Reddy)

Revanth Reddy : ఒక్కొక్కరికి రూ.5లక్షలు ఇస్తాం, ఒక్క ఛాన్స్ ప్లీజ్-రేవంత్ రెడ్డి

Revanth Reddy : టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలనపై ఫైర్ అయ్యారు. తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ రెండుసార్లు సీఎంగా అధికారంలో ఉండి.. కోరుట్ల ప్రాంతానికి ఏం చేశారో చెప్పగలరా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లు కోరుట్లకు వచ్చాయా? అని అడిగారు. ఈ ప్రాంతంలో పసుపు రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఎకరాకు లక్ష 50వేలు పెట్టుబడి పెడితే.. వారికి ఆత్మహత్యలే దిక్కవుతున్నాయని వాపోయారు. ఈ ప్రాంతంలో ఆనాడు రత్నాకర్ రావు చేసిన అభివృద్దే తప్ప బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు రేవంత్ రెడ్డి.

”బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి ఏం చేశారు? 2011లో శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ.. బీఆర్ఎస్ కు మద్దతు తెలిపింది. కోట్ల రూపాయలు తీసుకుని ఆనాడు ఈ ఎమ్మెల్యే.. కిరణ్ కుమార్ రెడ్డికి అమ్ముడుపోయింది వాస్తవం కాదా? ఆనాడు టీఆర్ఎస్ నుంచి నిన్ను సస్పెండ్ చేసింది నిజం కాదా?(Revanth Reddy)

Also Read..Delhi Liquor Scam : కవితను జైల్లో వేయాలంటే ఈడీకి ఇంత టైమా?పేరంటానికి పిలిచారా?ఇదంతా బీఆర్ఎస్,బీజేపీ డ్రామాలు : రేవంత్ రెడ్డి

తన ఓటును ఆంధ్రోళ్లకు అమ్ముకున్న విద్యా సాగర్ రావుకు మళ్లీ మళ్లీ కేసీఆర్ టికెట్ ఇచ్చారు. అంటే ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయిన దాంట్లో కేసీఆర్ వాటా ఎంత? 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని కవిత హామీ ఇచ్చారు. పరిశ్రమను తెరవకపోతే గేటుకు ఉరేసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. మాట తప్పిన కవితను పార్లమెంటు ఎన్నికల్లో పాతాళానికి తొక్కిండ్రు. మరి కల్వకుంట్ల విద్యాసాగర్ రావును ఎందుకు విడిచిపెట్టిండ్రు? మీరు తలచుకుంటే కవితనే పాతాళానికి తొక్కిండ్రు.. విద్యాసాగర్ రావు ఒక లెక్కనా?” అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.(Revanth Reddy)

Also Read..Anantapur Lok Sabha constituency: పవన్ కల్యాణ్‌ను పోటికి దించుతారా.. కొత్త ముఖాలేమైనా బరిలోకి దిగబోతున్నాయా?

”కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 నెలల్లో చక్కెర పరిశ్రమను తెరుస్తాం. పసుపు బోర్డు తెస్తానన్న గుండు.. బోర్డు తిప్పేశారు. ఎన్నో త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ తెచ్చినా అని చెప్పుకున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నేరవేర్చలేదు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేసీఆర్ ను అసదుద్దీన్ ఎందుకు ప్రశ్నించరు? మాట తప్పక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి” అని ఓటర్లను అభ్యర్థించారు రేవంత్ రెడ్డి.

Also Read..Bandi Sanjay Comments: మహిళల్ని అవమానించిన బండి సంజయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. బీఆర్ఎస్ మహిళా మంత్రుల డిమాండ్

”2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇళ్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. పేదలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకుంటాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం” అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.(Revanth Reddy)