Hyderabad: పక్కింట్లో భర్త ఫోన్‌ అలారం మోగింది.. ఆ ఇంట్లోకి వెళ్లి చూసిన భార్యకు

చాలా జంటలు సంతానం లేక ఇబ్బందులు పడుతున్నాయి. పెళ్ళై సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. చాలామంది సంతానం కోసం పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ఆసుపత్రులలో వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు.

Hyderabad: పక్కింట్లో భర్త ఫోన్‌ అలారం మోగింది.. ఆ ఇంట్లోకి వెళ్లి చూసిన భార్యకు

Hyderabad

Hyderabad: చాలా జంటలు సంతానం లేక ఇబ్బందులు పడుతున్నాయి. పెళ్ళై సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. చాలామంది సంతానం కోసం పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ఆసుపత్రులలో వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. అయినప్పటికీ కొందరికి ఎలాంటి సమస్య లేకపోయినా పిల్లలు కలగడం ఆలస్యమవుతుంటుంది. పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతున్నా కొద్దీ కుటుంబ సభ్యుల ఒత్తిళ్లు, సమాజంలో సూటిపోటి మాటలు దంపతులను కుంగదీస్తున్నాయి.

దంపతులు అన్యోన్యంగా ఉన్న ఇతరుల సూటిపోటి మాటలు వారిని వేధిస్తుంటాయి. ఆలా ఇతరుల వేధింపులు తట్టుకోలేక క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకున్న వారు చాలామందే ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇటువంటి ఘటనే.. కేపీహెచ్‌బీ కాలనీ వసంత్‌నగర్ ప్లాట్ నెంబర్.214లో రాహుల్(34), రమ్యశ్రీ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్ళై ఏడేళ్లుగా గడుస్తున్నా పిల్లలు లేకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరు చింతిస్తున్నారు.

రాహుల్ లో పిల్లలు లేరనే బాధ అధికంగా ఉంది. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య పిల్లల విషయంలో మాటలు నడిచాయి. ఈ విషయంపైనే ఇద్దరిమధ్య సోమవారం మాటలు జరిగాయి. ఆసుపత్రిలో చూపించుకోవాలని రాహుల్ ని రమ్య కోరింది. సరే అని చెప్పిన భర్త సాయంత్రం బయటకు వెళ్లివస్తానని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి అయినా తిరిగి రాలేదు. మెళుకువతోనే ఉన్న రమ్యశ్రీ అతడి స్నేహితులకు, బందువులకు ఫోన్ చేసి అదిగింది.. ఎవరు తమ దగ్గరకు రాలేదని సమాధానం చెప్పారు. ఇక మంగళవారం తెల్లవారు జామున పక్కపోర్షన్ లో భర్త ఫోన్ అలారం మోగింది.

అలారం సౌండ్ విన్న రమ్యశ్రీ పరుగుపరుగున ఇంట్లోకి వెళ్లి చూడగా భర్త సీలింగ్ ఫ్యాన్ కి ఉరివేసుకొని వేలాడుతున్నాడు. అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దింపారు. పోలీసులకు సమాచారం అందించారు. పిల్లలు కలగలేదని మనోవేదనతోనే రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.