MSDE: తెలంగాణలో మొదటిసారి వర్క్షాప్ నిర్వహించిన ఎంఎస్డీఈ
ఏ రంగంలో అయినా నైపుణ్యంతో కూడిన కార్మికుల అవసరం ఉంటుంది. అప్రెంటిస్షిప్ ఈ అవసరాలను తీర్చగలదు. ఈ తరహా వర్క్షాప్ల ద్వారా మన యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించడంతో పాటుగా ప్రస్తుత వ్యాపార వాతావరణంలో డిమాండ్ను సైతం తీర్చగలము. ఎంఎస్డీఈ చేపట్టిన ఈ కార్యక్రమం మరియు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ వద్ద ఐఎస్డీఎస్ కే.శ్రీనివాసరావు ఈ వర్క్షాప్ నిర్వహించడాన్ని అభినందిస్తున్నాను

MSDE: అప్రెంటిస్షిప్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటుగా భారతీయ యువత అప్రెంటిస్షిప్ను స్వీకరించేలా చేయడానికి నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్ధాపక మంత్రిత్వ శాఖ (ఎంఎస్డీఈ) దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 250కు పైగా వర్క్షాప్లను నిర్వహిస్తుంది. తద్వారా సంస్థలు, ఔత్సాహికులు, భాగస్వాముల నడుమ అప్రెంటిస్షిప్ సంస్కరణల పట్ల అవగాహన కల్పించనున్నారు. రీజనల్ డైరెక్టోరేట్, స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ సంబంధిత ప్రాంతాలలో ఈ కార్యక్రమాలను నిర్వహించనుంది.
‘Pariksha Pe Charcha’ 2023: పరీక్షల్లో ‘చీటింగ్’పై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ విషయమై వ్యవస్థాపక మంతిత్వ్రశాఖ (ఎంఎస్డీఈ) కార్యదర్శి అతుల్ కుమార్ తివారీ మాట్లాడుతూ చదువుకుంటూనే పనిచేయడమనేది ‘ఎడ్యూకేషన్ టు వర్క్ ట్రాన్సిషన్’లో నిలకడైన విధానమన్నారు. ఈ కారణం చేతనే దేశవ్యాప్తంగా 250 వర్క్షాప్లను ఎంఎస్డీఈ నిర్వహించనుందంటూ తద్వారా అప్రెంటిస్షిప్ ప్రయోజనాలను యువతతో పాటుగా వ్యాపార సంస్ధలకు సైతం వెల్లడిస్తున్నామన్నారు. అప్రెంటిస్షిప్ చట్టం–1961లో సంస్కరణల కారణంగా మన యువత అత్యుతమ శిక్షణ పొందగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
Viral Video: గోల్డ్ ఫిష్ ప్రాణాలు కాపాడిన కుక్క.. అబ్బురపరుస్తున్న వీడియో
కాగా, తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి తొలి వర్క్షాప్ను హైదరాబాద్లో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ వద్ద జనవరి 24, 2023న నిర్వహించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఐ.రాణి కుముదిని, ఐఏఎస్ ప్రారంభించారు. ఈ వర్క్షాప్లో రీజనల్ డైరెక్టోరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రిన్యూర్షిప్ (ఆర్డీఎస్ఈలు), బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ (బోట్), రాష్ట్ర ప్రభుత్వ జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ (డీఎస్సీ), జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పోరేషన్ (ఎన్ఎస్డీసీ) , విద్యా సంస్ధలు, పరిశ్రమ భాగస్వాములు, సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ (ఎస్ఎస్సీ)లు నుంచి 350 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
Pakistani rupee: భారీగా పతనమైన పాకిస్తాన్ రూపాయి… డాలర్కు 259కు పడిపోయిన కరెన్సీ
తెలంగాణా రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి రాణి కుముదిని, ఐఏఎస్ మాట్లాడుతూ ‘‘ఏ రంగంలో అయినా నైపుణ్యంతో కూడిన కార్మికుల అవసరం ఉంటుంది. అప్రెంటిస్షిప్ ఈ అవసరాలను తీర్చగలదు. ఈ తరహా వర్క్షాప్ల ద్వారా మన యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించడంతో పాటుగా ప్రస్తుత వ్యాపార వాతావరణంలో డిమాండ్ను సైతం తీర్చగలము. ఎంఎస్డీఈ చేపట్టిన ఈ కార్యక్రమం మరియు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ వద్ద ఐఎస్డీఎస్ కే.శ్రీనివాసరావు ఈ వర్క్షాప్ నిర్వహించడాన్ని అభినందిస్తున్నాను’’ అని అన్నారు.