Road Accident : సంగారెడ్డి జిల్లాలో విషాదం..టిప్పర్ ఢీకొని ఒకరు మృతి
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పటాన్ చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ దగ్గర టిప్పర్ లారీ బైక్ను ఢీకొంది. దీంతో బైకిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు.
One killed in road accident : సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పటాన్ చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ దగ్గర టిప్పర్ లారీ బైక్ను ఢీకొంది. దీంతో బైకిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై కూర్చున్న మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
గాయపడ్డ వ్యక్తిని చికిత్స కోసం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు అంటున్నారు.