Road Accident : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి క్వాలీస్ వాహనం ఢీకొట్టింది. దీంతో క్వాలీస్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

Road Accident : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

Accident

Six killed in road accident : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్వాలీస్ వాహనం లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పెద్దకొడపగల్ మండలం జగన్నాథపల్లి శివారులో ప్రమాదం చోటు చేసుకుంది.

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి క్వాలీస్ వాహనం ఢీకొట్టింది. దీంతో క్వాలీస్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులందరూ హైదరాబాద్ కు చెందిన వారుగా గుర్తించారు.

Vikarabad : వికారాబాద్ జిల్లాలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద మృతి

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బిచ్కుంద నుంచి పిట్లం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుల వద్ద లభించిన గుర్తింపు కార్డుల ద్వారా వారి వివరాలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.