Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 37వేల 597 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 32వేల 796 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 690కి తగ్గింది.
Telangana Covid News : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 10వేల 054 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 98 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 50 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 6 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 6 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 110 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం రిలీఫ్ ఇచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 37వేల 597 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 32వేల 796 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 690కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 9వేల 340 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 94 మందికి పాజిటివ్ గా పాజిటివ్ గా తేలింది.
తెలంగాణ కరోనా బులెటిన్..
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.27.09.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealth pic.twitter.com/1C96bZVbUV— IPRDepartment (@IPRTelangana) September 27, 2022