US Texas Firing : అమెరికాలో కాల్పులు .. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్డి కుమార్తె మృతి
అమెరికాలో గన్ కల్చర్ కు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంట్లో భాగంగా అమెరికాలో మరోసారి తుపాకీ గర్ఝించింది. తొమ్మిదిమందిని పొట్టనపెట్టుకుంది. తుపాకీ కాల్పుల్లో చనిపోయినవారిలో తెలంగాణకు చెందిన యువతి కూడా ఉంది. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జిగా పనిచేస్తున్న ఐశ్వర్య టెక్సాస్ లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది.
US Texas Firing : అమెరికాలో మరోసారి తుపాకీ తూటా గర్జించింది. శనివారం (మే8,2023)టెక్సాస్లోని ఓ షాపింగ్ మాల్ లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి తాటికొండ నర్సిరెడ్డి కుమార్తె తాటికొండ ఐశ్వర్య కూడా ఉన్నారు. సూర్యాపేట జిల్లా పాత నేరేడుచర్లకు చెందిన తాటికొండ నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. షాపింగ్ మాల్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తొమ్మిదిమంది మృతి చెందగా పలువురు చిన్నారులతో సహా మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ కు 25 కిలోమీటర్ల దూరంలోని అలెన్ ప్రీమియం ఔట్లెట్స్ అనే పెద్ద మాల్లో శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. కాల్పలు జరిగిన షాపింగ్ మాల్ లో 120 వరకు వివిధ కంపెనీల స్టోర్లు ఉన్నాయి. దాదాపు లక్షమంది జనాభా ఉన్నారు. శనివారం వీకెండ్ కావటంతో షాపింగ్ మాల్ కు జనాలు భారీగా వచ్చారు.
ఈక్రమంలో ఓ వ్యక్తి కారులో మాల్ వద్దకు వచ్చి కారు మాల్ బయటే ఆపేసి మాల్ లోకి చొరబడి కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం విన్న అక్కడివారంతా తీవ్ర భయాందోళనలకు గురి అయ్యారు. ప్రాణాలు చేతపట్టుకుని అటూ ఇటూ పరుగులు తీశారు.దీంతో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిదిమంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆ సమయంలో మాల్లోనే ఉన్న అలెన్ పోలీసు అధికారి ఒకరు అప్రమత్తమై దుండగుడిని కాల్చిచంపారు. ఆ తరువాత వెంటనే ఎమర్జన్సీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.