పీటలపై ఆగిన పెళ్లి..

పీటలపై ఆగిన పెళ్లి..

The cops who stopped the wedding in Mahabubabad : మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో పీటలమీదే ఓ పెళ్లి ఆగిపోయింది. పాత సినిమాల్లోని సీన్స్‌లాగా….. వరుడు తాళి కట్టే సమయానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ వివాహాన్ని ఆపేయాలని ఆర్డరేశారు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, వివాహానికి వచ్చిన అతిధులు అవాక్కయ్యారు.

మరిపెడ మండలం గుండెపుడికి చెందిన యామిని రాకేశ్‌కు, కురవి మండలం కాంపెల్లి గ్రామానికి చెందిన ఎర్రకుంట దివ్యకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈ ఉదయం 11గంటల 55 నిమిషాలకు ముహూర్తం పెట్టారు. అందరూ కళ్యాణమండపానికి చేరుకున్నారు. వధూవరులు, వారి బంధువుల రాకతో కళ్యాణమండపం కళకళలాడింది. విందు కోసం మంచి భోజనాలను కూడా రెడీ చేశారు. తీరా వరుడు వధువు మెడలో తాళికట్టే సమయానికి పోలీసులు వచ్చి పెళ్లిని ఆపేశారు.

అయితే వధువు దివ్య…. మరో యువకుడిని ప్రేమించింది. ఇది తెలిసిన ఆమె తల్లిదండ్రులు మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. తనకు ఇష్టం లేదని మొదటి నుంచి చెబుతున్నా.. బలవంతంగా పెళ్లి చేసేందుకు రెడీ అయ్యారు. పెళ్లి చేసుకుంటే మేము బతుకుతామని.. లేకుంటే చనిపోతామని బెదిరించినట్టు కూడా తెలుస్తోంది.

దీంతో కాసేపట్లో పెళ్లి పూర్తవుతుందన్న సమయంలో వధువు దివ్య పోలీసులకు ఫోన్‌ చేసింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. వచ్చి ఆపాలని కోరింది. దీంతో పోలీసులు వచ్చి పెళ్లిని ఆపేశారు.