Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు

Kishan Reddy : డాక్టర్ల బృందం కిషన్ రెడ్డికి చికిత్స అందిస్తోంది. ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే కిషన్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు.

Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు

Kishan Reddy (Photo : Google)

Kishan Reddy : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల బృందం కిషన్ రెడ్డికి చికిత్స అందిస్తోంది. గ్యాస్ ట్రబుల్ తోనే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు డాక్టర్లు తెలిపారు. కిషన్ రెడ్డి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితులు చెప్పారు. ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే కిషన్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు.

అంతకుముందు.. ఓ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ ను పురస్కరించకుని ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ ప్రాంగణంలో.. మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ ప్రస్తావించిన పలు అంశాల ఆధారంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేశారు. ఆదివారం సాయంత్రం కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో కలిసి కిషన్ రెడ్డి ఈ గ్యాలరీని ప్రారంభించారు. ప్రధాని మోదీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ పై ప్రశంసల వర్షం కురిపించారు మోదీ. దేశ వారసత్వం, చరిత్ర, సంస్కృతిని మన్ కీ బాత్ తెలియజేస్తుందన్నారు కిషన్ రెడ్డి.