మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధానితో కీలక భేటీ..!

ప్రధానిని కలిసిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.

మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధానితో కీలక భేటీ..!

Cm Chandrababu Delhi Tour : ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 16న ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు.. 17న ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే మోదీ అపాయింట్ మెంట్ కోరారు. రాజధాని, పోలవరం నిర్మాణాలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులతో పాటు కొంత రుణాలకు సంబంధించి మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. జగన్ హయాంలో చేసిన రుణాలు రీషెడ్యూల్ చేయాలని కోరనున్నారు చంద్రబాబు. మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు.

సీఎం చంద్రబాబు ఎల్లుండి సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. 17వ తేదీన ప్రధానితో అపాయింట్ మెంట్ కోసం సీఎంవో కోరింది. ప్రధాని అపాయింట్ మెంట్ ఖరారు కావాల్సి ఉంది. ఎల్లుండి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు చంద్రబాబు. ప్రధానిని కలిసిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.

Also Read : ఎటూ తప్పించుకోలేని పరిస్థితిలో వైసీపీ నేత..! జోగి రమేశ్‌ చుట్టూ ఉచ్చుబిగిస్తున్న ప్రభుత్వం