ఏపీలో కొత్తగా 1,031 కరోనా కేసులు, 8 మంది మృతి

  • Published By: sreehari ,Published On : November 26, 2020 / 07:50 PM IST
ఏపీలో కొత్తగా 1,031 కరోనా కేసులు, 8 మంది మృతి

Updated On : November 26, 2020 / 7:50 PM IST

AP Covid-19 positive Cases : ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు.



రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 67, 269 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో కొత్తగా 1,031 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 8,65,705లకు చేరాయి. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి.



కరోనా బారినపడి 8 మంది మరణించారు. 1,081 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 8,46,120 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 98,55,316 మందికి శాంపిల్స్ పరీక్షించగా 12,615 యాక్టివ్ కేసులు ఉన్నాయి.



గడిచిన 24 గంటల్లో కరోనాతో కృష్ణలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఒక్కరు, గుంటూరులో ఒక్కరు, కడపలో ఒక్కరు, కర్నూల్‌లో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.