AP Corona Cases : ఏపీలో కొత్తగా 3,396 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో 3,396 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 9మంది కోవిడ్ తో చనిపోయారు.

AP Corona Cases : ఏపీలో కొత్తగా 3,396 కరోనా కేసులు

Ap Corona Cases

Updated On : February 5, 2022 / 9:08 PM IST

AP Corona Cases : ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో 3,396 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 9మంది కోవిడ్ తో చనిపోయారు. అనంతపురం, నెల్లూరు, ప్రకాశంలో ఇద్దరు చొప్పున… చిత్తూరు, గుంటూరు, కర్నూలులో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఒక్కరోజే 13,005 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 78వేల 746 కోవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 29వేల 838 కరోనా టెస్టులు చేసినట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

Worst Passwords: ఈ పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నారా? వెంటనే మార్చుకోండి.. సెకన్లలో హ్యాక్ చేసేస్తారు

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,00,765. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,07,364. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 655కి పెరిగింది. శుక్రవారం 4వేల 198 కరోనా కేసులు నమోదవగా.. శనివారం ఆ సంఖ్య తగ్గింది.

అటు దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్న‌ దేశంలో 1,27,952 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, క‌రోనా నుంచి 2,30,814 మంది కోలుకున్నార‌ని వివరించింది.

Mukesh Ambani: భారత్ లోనే అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్న ముకేశ్ అంబానీ

క‌రోనా కార‌ణంగా నిన్న 1,059 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం 13,31,648 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 5,01,114కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతం పెరిగింది. వినియోగించిన‌ క‌రోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య‌ 1,68,98,17,199కు చేరింది.

కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య తగ్గింది. ఈ నేపథ్యంలో దేశంలో థర్డ్‌ వేవ్‌ గరిష్ఠ స్థితి దాటినట్లేనా అన్న ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానమిచ్చింది. వేవ్‌, పీక్‌ వంటి పదాలను పక్కనబెడితే.. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు, పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోందని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే దేశవ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్నట్లే కన్పిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఒమిక్రాన్‌ ప్రభావంతో జనవరి నెలలో దేశంలో కోవిడ్‌ థర్డ్ వేవ్ ఉద్ధృతి స్పష్టంగా కనిపించింది. నిత్యం పెరుగుతూ వెళ్లిన కొవిడ్‌ కేసులు, జనవరి 21వ తేదీ నాటికి 3 లక్షల 47 వేలకు చేరింది. ఈ వేవ్‌లో రోజువారీ కేసుల్లో అదే గరిష్ఠం. అప్పటి నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఫిబ్రవరి 3 నాటికి ఆ సంఖ్య లక్షా 72 వేలకు పడిపోయింది. ఇదే సమయంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు దాదాపు 18 శాతం నుంచి 11 శాతానికి చేరింది. దీంతో దేశంలో థర్డ్‌వేవ్‌ ప్రభావం గరిష్ఠ స్థితి దాటినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరికొన్ని రోజులు ఇదే విధంగా ఉంటే వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వచ్చినట్లేనని అభిప్రాయపడుతున్నారు.

ఇక, ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ కాస్త తక్కువ తీవ్రత కలిగినట్లు ఇప్పటివరకు వచ్చిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటికి గల కారణాలను విశ్లేషించే పనిలో నిమగ్నమైన నిపుణులు.. వైరస్‌ గుణం కంటే వాటిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ప్రజల్లో అధికంగా ఉండడమే కారణమనే అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పిన శాస్త్రవేత్తలు, సాధ్యమైనంత త్వరగా ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలకు కరోనా వ్యాక్సిన్లను అందించే ప్రయత్నం చేయాలని సూచించారు.

ఇన్‌ఫెక్షన్‌కు గురైన వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి స్థాయికి సంబంధించిన అంశాల వల్లే ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 2021 చివరి నాటికి దక్షిణాఫ్రికా ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవడమో లేదా అంతకుముందు వేవ్‌లలో వైరస్‌కు గురై ఉండవచ్చని అంచనా వేశారు. ఇలా గతంలో ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం వల్లే ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రత తక్కువగా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతోపాటు రీ-ఇన్‌ఫెక్షన్‌కు గురిచేసే సామర్థ్యం ఒమిక్రాన్‌కు తక్కువగా ఉండడం వల్లే లక్షణాలు తక్కువగా కనిపిస్తూ ఉండవచ్చని అన్నారు.