Chandrababu : డిసెంబర్ 7న ఢిల్లీకి చంద్రబాబు.. అనంతరం జల్లాల పర్యటన

జైలు నుంచి విడుదల అయిన తరువాత చంద్రబాబు కంటి ఆపరేషన్ తరువాత పూర్తిగా కోలుకున్నారు. తిరిగి ప్రజల్లో తిరిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంట్లో భాగంగా పలు జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.

Chandrababu : డిసెంబర్ 7న ఢిల్లీకి చంద్రబాబు.. అనంతరం జల్లాల పర్యటన

chandrababu

chandrababu Delhi visit : జైలు నుంచి విడుదల అయిన తరువాత చంద్రబాబు కంటి ఆపరేషన్ చేయించుకున్నారు.  తరువాత ఆరోగ్యపరంగా కూడా కోలుకున్నారు. తిరిగి ప్రజల్లో తిరిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంట్లో భాగంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విజయవాడ కనకదుర్గమ్మను. సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. ఇక ప్రజల్లో తిరిగేందుకు సమాయత్తమవుతున్నారు.

ఈక్రమంలో డిసెంబర్ 7న ఢిల్లీ వెళుతున్నారు. ఢిల్లీ పర్యటన పూర్తి అయ్యాక తిరిగి వచ్చి జిల్లాల్లో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. 7న ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల విషయంలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. తరువాత తిరిగి ఏపీ చేరుకుని జిల్లాల్లో పర్యటించనున్నారు.

దీంట్లో భాగంగా..డిసెంబర్ 11న శ్రీకాకుళం, 12న కాకినాడ,14న నరసరావుపేట, 15న కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో చంద్రబాబు వైసీపీ పాలనలో జరుగుతున్న పలు అంశాలను ఎత్తిచూపనున్నట్లుగా సమాచారం.

కాగా..జైలునుంచి విడుదల తరువాత చంద్రబాబు ప్రముఖ దేవాలయాలు సందర్శిస్తు దర్శనం చేసుకుంటున్న క్రమంలో ఆయన శ్రీశైలం కూడా వెళ్లాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ మిచాంగ్ తుపాను కారణంతో అది వాయిదా పడింది. అలాగే లోకేశ్‌ యువగళం పాదయాత్రకు కూడా మిచాంగ్ తుపాను వల్ల తాత్కాలికంగా బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే.