తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. తీవ్ర భయాందోళనలో భక్తులు

ఇప్పుడు మరోసారి చిరుత కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. తీవ్ర భయాందోళనలో భక్తులు

Tirumala Cheetah : తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. మొదటి ఘాట్ రోడ్ లో చిరుత సంచరిస్తోంది. 56వ మలుపు వద్ద వాహనదారులకు చిరుత కనిపించింది. దీంతో అటవీశాఖ అధికారులకు వాహనదారులు సమాచారం ఇచ్చారు. గతంలోనూ తిరుమలలో చిరుతల సంచారం కలకలానికి దారితీసింది. పలువురిపై దాడి చేశాయి. దీంతో కొన్నింటిని అటవీశాఖ అధికారులు బంధించారు. ఇప్పుడు మరోసారి చిరుత కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.