Gold Price Today: మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన గోల్డ్ ధరల్లో మంగళవారం కాస్త పెరుగుదల చోటు చేసుకుంది.

Gold Price Today: మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

Gold

Updated On : August 22, 2023 / 7:27 AM IST

Gold and Silver Prices Today: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన గోల్డ్ ధరల్లో మంగళవారం కాస్త పెరుగుదల చోటు చేసుకుంది. గత నెలలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవటంతో ఎక్కువ శాతంమంది మహిళలు గోల్డ్ కొనుగోలుకు వెనుకడుగు వేశారు. ఈనెల ప్రారంభం నుంచి బంగారం ధరలు తగ్గుకుంటూ వస్తున్నాయి. తాజాగా మంగళవారం బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధరపై రూ.50 మేర పెరిగింది.

Gold

Gold

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,070గా నమోదైంది. సోమవారంతో పోల్చితే 10గ్రాముల బంగారం ధరపై రూ.50 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, విశాఖపట్టణం, విజయవాడ ప్రాంతాల్లో బంగారం ధరలు ఒకే విధంగా ఉన్నాయి.

Gold

Gold

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..

– దేశ రాజధాని ఢిల్లీలోనూ 10 గ్రాముల బంగారంపై రూ. 50మేర పెరిగింది. మంగళవారం ఉదయం ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,220గా ఉంది.
– ముంబైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,070గా ఉంది.
– చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,500గా నమోదైంది.
– బెంగళూరులో పది గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,150 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,070గా ఉంది.
– కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,150 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 59,070గా ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరపై రూ.50 మేర పెరుగుదల చోటు చేసుకుంది.

Gold

Gold

వెండి ధరలు ఇలా ..

తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణాల్లో కిలో వెండి ధర రూ.76,500గా ఉంది. అయితే, దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలో రూ. 200 పెరుగుదల చోటు చేసుకుంది. ఢిల్లీలో కేజీ వెండి ధర సోమవారం 73,300 ఉండగా, మంగళవారం రూ.200 పెరగడంతో రూ. 73,500కు చేరుకుంది. చెన్నైలో రూ. 76,700, ముంబైలో 73,300గా ఉంది. బెంగళూరులో సోమవారంతో పోల్చుకుంటే వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఇక్కడ కిలో వెండి ధర రూ. 72,500 గా ఉంది. కోల్‌కతాలో కిలో వెండిధర రూ. 73,500గా ఉంది.