ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబానికి రూ.10లక్షల చెక్ ఇచ్చిన మంత్రి

10 lakhs check to varalakshmi family: విశాఖ జిల్లా గాజువాకలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి(17) కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత సోమవారం(నవంబర్ 2,2020) పరామర్శించారు. రూ.10లక్షల చెక్ ని వారి కుటుంబానికి ఇచ్చారు. ప్రేమోన్మాది అఖిల్ సాయికి శిక్ష తప్పదని హోంమంత్రి అన్నారు. వరలక్ష్మి ఇంటికి వెళ్లిన హోంమంత్రి, అండగా ఉంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.
ఈ ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. మహిళల భద్రత పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని డీజీపీ, సీఎస్ లను జగన్ ఆదేశించారు. విద్యార్ధినులంతా దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకొనే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ విషయం తెలిసిన వెంటనే హోంశాఖ మంత్రి సుచరితకు ఫోన్ చేశారు జగన్.