జనసేనకు ఊహించని షాక్…వైసీపీలోకి గేదెల శ్రీనుబాబు

  • Published By: venkaiahnaidu ,Published On : March 16, 2019 / 04:16 PM IST
జనసేనకు ఊహించని షాక్…వైసీపీలోకి గేదెల శ్రీనుబాబు

Updated On : March 16, 2019 / 4:16 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన  గేదెల శ్రీనివాస్ అలియాస్ శ్రీనుబాబు శనివారం(మార్చి-16,2019) వైసీపీలో చేరారు. వైసీపీ అధ్యక్షడు జగన్ శ్రీనుబాబుకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీనుబాబు వైసీపీలో చేరడంతో పవన్ కు ఊహించని షాక్ తగిలినట్లయింది.ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన ఎంపీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి జాబితాలోనే జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థిగా శ్రీనుబాబు పేరును పవన్ ప్రకటించారు.జనసేన ఉత్తరాంధ్ర కన్వీనర్ గా శ్రీనుబాబు కొనసాగారు.