వాలంటీర్ల జీతాలు పెంచుతామని చంద్రబాబు అంటున్నారు.. కానీ, ఏం చేస్తారో తెలుసా?: కొడాలి నాని

ఇప్పుడు పనిచేస్తున్న వారిని తొలగించి, టీడీపీ కార్యకర్తలతో..

వాలంటీర్ల జీతాలు పెంచుతామని చంద్రబాబు అంటున్నారు.. కానీ, ఏం చేస్తారో తెలుసా?: కొడాలి నాని

Kodali Nani

Kodali Nani: వాలంటీర్ల పేరు చెబితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉలిక్కి పడుతున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. అమరావతిలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లపై చంద్రబాబు యూటర్న్ అంతా నాటకమేనని చెప్పారు.

వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేశారని కొడాలి నాని తెలిపారు. వారిని ఎన్నికల్లో వాడుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. వాలంటీర్లకు ఏది మంచో తెలుసని అన్నారు. అదే విషయాన్ని వారు ప్రజలకు చెబుతారని అన్నారు.

సేవలు అందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని కొడాలి నాని చెప్పారు. ఇప్పుడేమో వాలంటీర్ల జీతాలు పెంచుతామని చంద్రబాబు నాయుడు అంటున్నారని తెలిపారు.

చంద్రబాబు అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలను తిరిగి ఏర్పాటుచేస్తారని, కార్యకర్తలను పెట్టుకుని వారికి జీతాలు ఇస్తారని కొడాలి నాని ఆరోపించారు. ఇప్పుడు పనిచేస్తున్న వారిని తొలగించి, టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు కలెక్షన్లు వసూలు చేయిస్తారని చెప్పారు.

Also Read: లిక్కర్ కేసు డబ్బు ఎక్కడుందో రేపు కేజ్రీవాల్ కోర్టులో చెబుతారు! : సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు